Koti Deepotsavam 2025 Day 9: వైకుంఠమే భువికి వచ్చిన వేళ.. కన్నుల పండుగగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 9: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 9వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు “ఓం నమః శివాయ” అంటూ దీపాలు వెలిగించగా, ఆ కాంతి ఎన్టీఆర్ స్టేడియం అంతటా దివ్య కాంతిని నింపింది. ప్రతి దీపం ‘ఆత్మజ్యోతి’ సందేశాన్ని అందిస్తూ, భక్తుల మనసులను మైమరిపించింది. 2012లో మొదలైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మికోత్సవాలకు ప్రతీకగా నిలుస్తోంది. భక్తి, ఆరాధనతో నిండిన ఈ వాతావరణం ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది.
Also Read
- Chanakya Niti: జీవితంలో గెలవాలంటే 'చాణక్యుడి' ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
- Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..

కోటి దీపోత్సవం 2025లో భాగంగా తొమ్మిదో రోజు ఆదివారం (నవంబర్ 9, 2025) నాడు నిర్వహించిన విశేష కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింత పెంచాయి. నేడు ముఖ్య అతిథులుగా శ్రీ మధు పండిట్ దాస్ (బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్), శ్రీ సత్యా గౌర చంద్ర దాస్ (హైదరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు) హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. భక్తులను ఉద్దేశించి శ్రీ దేవి నరసింహా దీక్షితులు గారు ప్రవచనామృతం అందించారు.
వైదిక పూజ కార్యక్రమాలలో శ్రీ నృసింహ రక్షా కంకణ పూజ, గురువాయూర్ శ్రీకృష్ణ నవనీత పూజ, నాగసాధువులచే మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులందరిచే శ్రీ నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రధాన కార్యక్రమాలలో ఒకటిగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగింది. వైకుంఠమే భువికి వచ్చిందా.. అనే రీతిలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. అంతేకాకుండా స్వామివారికి గరుడ వాహన సేవ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ విశేష కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు.
పాప పరిహారం, శాంతి, ఐశ్వర్యం అనుగ్రహించే “స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం”#BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/GbQQeymry4
— BhakthiTV (@BhakthiTVorg) November 9, 2025
తాజావార్తలు
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!