Rajanna Temple: మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు.. నేటి నుంచి అమలు..
- నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..
- నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
- ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితం..
- ఉదయం 10.15 నుంచి 11.15 వరకు- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Temple: రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ ఏడీ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడంతో ఆలయ అధికారులు ఆలయంలో బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాల కోసం ఆలయంలో ప్రస్తుతం ఉన్న శీఘ్ర దర్శన క్యూ లైన్ను వినియోగిస్తూ శీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులను నేరుగా ఆలయ తూర్పు ద్వారం నుంచి పంపించేందుకు క్యూ లైన్లను సిద్ధం చేసినట్లు ఈఈ రాజేష్, డీఈ రఘునందన్ తెలిపారు. దీని నుండి ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు క్రమం తప్పకుండా రెండుసార్లు నిర్వహించనున్నారు.
Read also: Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు..
Also Read
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
బ్రేక్ దర్శనాలు ఉదయం 10.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రూ.300 టికెట్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. శ్రావణమాసం కావడంతో ఆలయానికి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులుగా భక్తుల రాకతో రాజన్న క్షేత్రం సందడిగా మారనుంది. స్వామివారికి ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం చతుష్షష్టి పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో ఐదు సోమవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయని అర్చకులు తెలిపారు.
Read also: MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్శనం కల్పించాలని, భక్తులకు రోజుకు రెండుసార్లు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు మరియు పీఠాధిపతిని పేదల దేవుడుగా పిలుస్తుంటారు కాబట్టి, ఈ మందిరాన్ని భక్తులు సందర్శిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్ వంటి ప్రక్క రాష్ట్రాల నుండి యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రతిరోజూ దాదాపు 20,000 నుండి 30,000 మంది యాత్రికులు శివుని దర్శనం చేసుకుంటారు.
Read also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
అధిష్టాన దేవతకి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి జాతర జరిగే మూడు రోజులలో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్వైవార్షిక గిరిజనుల సమ్మక్క-సారక్క జాతరకు ముందు ఆలయానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఉత్తర తెలంగాణలో, సమ్మక్క-సారక్క జాతరను సందర్శించే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. పండుగలు, శ్రావణ మాసంలో కూడా ఆలయానికి భారీ రద్దీ ఉంటుంది.
MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..