Rajanna Temple: మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు.. నేటి నుంచి అమలు..
- నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..
- నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
- ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితం..
- ఉదయం 10.15 నుంచి 11.15 వరకు- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు
Rajanna Temple: రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ ఏడీ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడంతో ఆలయ అధికారులు ఆలయంలో బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాల కోసం ఆలయంలో ప్రస్తుతం ఉన్న శీఘ్ర దర్శన క్యూ లైన్ను వినియోగిస్తూ శీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులను నేరుగా ఆలయ తూర్పు ద్వారం నుంచి పంపించేందుకు క్యూ లైన్లను సిద్ధం చేసినట్లు ఈఈ రాజేష్, డీఈ రఘునందన్ తెలిపారు. దీని నుండి ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు క్రమం తప్పకుండా రెండుసార్లు నిర్వహించనున్నారు.
Read also: Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు..
Also Read
- Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
- Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
- Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
బ్రేక్ దర్శనాలు ఉదయం 10.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రూ.300 టికెట్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. శ్రావణమాసం కావడంతో ఆలయానికి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులుగా భక్తుల రాకతో రాజన్న క్షేత్రం సందడిగా మారనుంది. స్వామివారికి ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం చతుష్షష్టి పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో ఐదు సోమవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయని అర్చకులు తెలిపారు.
Read also: MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్శనం కల్పించాలని, భక్తులకు రోజుకు రెండుసార్లు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు మరియు పీఠాధిపతిని పేదల దేవుడుగా పిలుస్తుంటారు కాబట్టి, ఈ మందిరాన్ని భక్తులు సందర్శిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్ వంటి ప్రక్క రాష్ట్రాల నుండి యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రతిరోజూ దాదాపు 20,000 నుండి 30,000 మంది యాత్రికులు శివుని దర్శనం చేసుకుంటారు.
Read also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
అధిష్టాన దేవతకి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి జాతర జరిగే మూడు రోజులలో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్వైవార్షిక గిరిజనుల సమ్మక్క-సారక్క జాతరకు ముందు ఆలయానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఉత్తర తెలంగాణలో, సమ్మక్క-సారక్క జాతరను సందర్శించే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. పండుగలు, శ్రావణ మాసంలో కూడా ఆలయానికి భారీ రద్దీ ఉంటుంది.
MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
తాజావార్తలు
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!