Rajanna Temple: మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు.. నేటి నుంచి అమలు..
- నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..
- నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
- ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితం..
- ఉదయం 10.15 నుంచి 11.15 వరకు- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Temple: రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ ఏడీ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడంతో ఆలయ అధికారులు ఆలయంలో బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాల కోసం ఆలయంలో ప్రస్తుతం ఉన్న శీఘ్ర దర్శన క్యూ లైన్ను వినియోగిస్తూ శీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులను నేరుగా ఆలయ తూర్పు ద్వారం నుంచి పంపించేందుకు క్యూ లైన్లను సిద్ధం చేసినట్లు ఈఈ రాజేష్, డీఈ రఘునందన్ తెలిపారు. దీని నుండి ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు క్రమం తప్పకుండా రెండుసార్లు నిర్వహించనున్నారు.
Read also: Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు..
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
బ్రేక్ దర్శనాలు ఉదయం 10.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రూ.300 టికెట్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. శ్రావణమాసం కావడంతో ఆలయానికి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులుగా భక్తుల రాకతో రాజన్న క్షేత్రం సందడిగా మారనుంది. స్వామివారికి ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం చతుష్షష్టి పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో ఐదు సోమవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయని అర్చకులు తెలిపారు.
Read also: MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్శనం కల్పించాలని, భక్తులకు రోజుకు రెండుసార్లు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు మరియు పీఠాధిపతిని పేదల దేవుడుగా పిలుస్తుంటారు కాబట్టి, ఈ మందిరాన్ని భక్తులు సందర్శిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్ వంటి ప్రక్క రాష్ట్రాల నుండి యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రతిరోజూ దాదాపు 20,000 నుండి 30,000 మంది యాత్రికులు శివుని దర్శనం చేసుకుంటారు.
Read also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
అధిష్టాన దేవతకి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి జాతర జరిగే మూడు రోజులలో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్వైవార్షిక గిరిజనుల సమ్మక్క-సారక్క జాతరకు ముందు ఆలయానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఉత్తర తెలంగాణలో, సమ్మక్క-సారక్క జాతరను సందర్శించే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. పండుగలు, శ్రావణ మాసంలో కూడా ఆలయానికి భారీ రద్దీ ఉంటుంది.
MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
తాజావార్తలు
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!