Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhika Masa Purnima: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధిక మాస పౌర్ణమికి ఆధ్యాత్మికంగా మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర తిథి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, దాన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.
తిథి వేళల వివరాలు ఇవే..
క్యాలెండర్ ప్రకారం.. పౌర్ణమి తిథి మే 30వ తేదీ (నిన్న) ఉదయం 11:57 గంటలకే ప్రారంభమైంది. ఇది ఈరోజు (మే 31) మధ్యాహ్నం 2:14 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజు సూర్యోదయంతో పౌర్ణమి తిథి కూడి ఉండటంతో, స్నాన – దాన కార్యక్రమాలకు ఈ రోజే అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
Also Read
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
- Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
స్నానాలకు శుభ ముహూర్తాలు..
పౌర్ణమి రోజున నదీ స్నానానికి బ్రహ్మ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4:03 గంటల నుంచి 4:43 గంటల వరకు ఉన్న బ్రహ్మ ముహూర్తంలో భక్తులు గంగానదితో పాటు ఇతర పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే తెల్లవారుజామున 4:33 గంటలకు స్టార్ట్ అయిన అమృత కాలం ఉదయం 6:20 గంటల వరకు కొనసాగింది. ఈ సమయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు చేశారు. ఒకవేళ ఉదయం స్నానం చేయలేకపోయిన వారు.. మధ్యాహ్నం 11:57 గంటల నుంచి 12:51 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా పవిత్ర స్నానాలు ఆచరించవచ్చని చెబుతున్నారు.
దానాలు చేయడానికి ఉత్తమ సమయం ఇదే
అధిక మాస పౌర్ణమి రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజు దానం చేయడానికి ఉదయం 8:51 గంటల నుంచి 10:35 గంటల మధ్య సమయం అత్యంత అనుకూలమైనదిగా నిర్ణయించారు. ఈ పవిత్ర దినాన మీ శక్తి సామర్థ్యాల మేరకు ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం అని జ్యోతిష్యులు అన్నారు. బియ్యం, పప్పులు, పిండి, బెల్లం, నెయ్యి, పాలు, మామిడి పండ్లు లేదా అరటిపండ్లు, దుస్తులు, గొడుగు, నీటితో నింపిన మట్టి కుండ.
అధిక మాస పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే..
హిందూ పురాణాల ప్రకారం.. అధిక మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే ఈ మాసానికి ఆయన తన పేరైన ‘పురుషోత్తమ మాసం’ అని నామకరణం చేశారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కాలంలో చేసే స్నానం, జపం, తపస్సు, పూజలు, దానధర్మాలకు సాధారణ రోజుల కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!