Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
- ఈవీ కార్ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్..
- టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
- సియెర్రా. ఈవీ, అవెన్యాతో పాటు ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఇందులో సియెర్రా. ev(Sierra.ev), అప్డేటెడ్ పంచ్.ev ( Punch.ev) 2026 తొలి అర్థభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది చివరి నాటికి టాటా నుంచి తొలిసారిగా ప్రీమియం ఈవీ కార్ ‘అవిన్యా’(Avinya) రాబోతోంది. FY2027, FY2030 మధ్య మరో మూడు కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Also Read
- Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
Read Also: MEA: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..
టాటా మోటార్స్ ఇప్పటికే భారత్లో మొత్తం 2.5 లక్షల ఈవీల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క టాటా నుంచే 65 శాతం కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ఈవీ(Nexon.ev) ఒక్కటే లక్షకు మించిన అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో లక్ష మార్కును దాటిని తొలి ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. టాటా మోటార్స్ తన ఈవీ కస్టమర్లలో తొలిసారిగా ఈవీని కొనుగోలు చేసిన వారు 26 శాతం మంది ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం, టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హరియర్ ఈవీలు ఉన్నాయి.
మరోవైపు, టాటా మోటార్స్ తన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకుంది. టాటా ఈవీ ఓపెన్ కొలాబరేషన్ ఫ్రేమ్వర్క్ కింద సుమారు 4 లక్షల ఛార్జింగత్ పాయింట్లు ఉన్నాయి. ఇందుల్లో 30,000కు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉ న్నాయి. 2030 నాటికి వీటిని 10 లక్షల చార్జింగ్ పాయింట్లకు, ఇందులో కనీసం 1 లక్షలకు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉండాలని ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!