Tata Motors- Mahindra: జూలై సేల్స్ లో దుమ్మురేపిన టాటా, మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో దేశీయంగా 81,790 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. అయితే గతేడాది దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలను పరిశీలిస్తే 54,119 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. జూలై 2021తో పోలిస్తే.. ఈ ఏడాది జూలైలో దేశీయ అమ్మకాలే 78,978 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. దేశీయ అమ్మకాల్లో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో కూడా టాటా దూసుకుపోతోంది. గతేడాది జూలైతో పోలిస్తే 2022 జూలైలో 604 యూనిట్ల నుంచి 4022 యూనిట్ల అమ్మకాలకు పెరిగినట్లు టాటా వెల్లడించింది. డొమెస్టిక్ మార్కెట్ లో వాణిజ్య వాహన విక్రయాలు జూలై 2022లో 31,473 యూనిట్లుగా ఉన్నాయని.. 2021లో జూలైలో కేవలం 21,796 ఉన్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
Read Also: Two Sets Of Twins: ప్రపంచంలోనే అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జంట కవలలకు జన్మనిచ్చిన మహిళ
Also Read
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
ఇదిలా ఉంటే మరో ఆటో మేకర్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జూలై సెల్స్ లో 31 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా నుంచి తాజాగా విడుదలైన స్కార్పియో – ఎన్ మోడల్ జూలై 30 లోపు లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్స్ ప్రారంభం అయిన నిమిషాల్లోనే మహీంద్రా షేర్ల విలువ 6.37 శాతం పెరిగి రూ. 1239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జూలై నెలలలో మహీంద్రా మొత్తం 56,148 వాహనాలకు అమ్మింది. ఇందులో యుటిలిటీ వాహనాలు 27854 ఉండగా.. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో 28,053 వాహనాలను అమ్మింది. మహీంద్రా ఎక్స్ యూ వీ 700, థార్, బొలెరో, ఎక్స్ యూ వీ 300 తీవ్రమై డిమాండ్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!