Tata Motors- Mahindra: జూలై సేల్స్ లో దుమ్మురేపిన టాటా, మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో దేశీయంగా 81,790 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. అయితే గతేడాది దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలను పరిశీలిస్తే 54,119 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. జూలై 2021తో పోలిస్తే.. ఈ ఏడాది జూలైలో దేశీయ అమ్మకాలే 78,978 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. దేశీయ అమ్మకాల్లో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో కూడా టాటా దూసుకుపోతోంది. గతేడాది జూలైతో పోలిస్తే 2022 జూలైలో 604 యూనిట్ల నుంచి 4022 యూనిట్ల అమ్మకాలకు పెరిగినట్లు టాటా వెల్లడించింది. డొమెస్టిక్ మార్కెట్ లో వాణిజ్య వాహన విక్రయాలు జూలై 2022లో 31,473 యూనిట్లుగా ఉన్నాయని.. 2021లో జూలైలో కేవలం 21,796 ఉన్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
Read Also: Two Sets Of Twins: ప్రపంచంలోనే అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జంట కవలలకు జన్మనిచ్చిన మహిళ
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఇదిలా ఉంటే మరో ఆటో మేకర్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జూలై సెల్స్ లో 31 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా నుంచి తాజాగా విడుదలైన స్కార్పియో – ఎన్ మోడల్ జూలై 30 లోపు లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్స్ ప్రారంభం అయిన నిమిషాల్లోనే మహీంద్రా షేర్ల విలువ 6.37 శాతం పెరిగి రూ. 1239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జూలై నెలలలో మహీంద్రా మొత్తం 56,148 వాహనాలకు అమ్మింది. ఇందులో యుటిలిటీ వాహనాలు 27854 ఉండగా.. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో 28,053 వాహనాలను అమ్మింది. మహీంద్రా ఎక్స్ యూ వీ 700, థార్, బొలెరో, ఎక్స్ యూ వీ 300 తీవ్రమై డిమాండ్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.