Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..
- భారత్లో పూర్తిస్థాయి తయారీ యూనిట్ను ప్రారంభించిన టాటా-జెఎల్ఆర్..
- రూ. 9000 వేల కోట్లతో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ల తయారీ ప్లాంట్..
- ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్/ డీజిల్ వాహనాలు కూడా తయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata- JLR Luxury Electric SUV: భారత్లో ప్రీమియం ఆటోమొబైల్ రంగంలో తొలిసారిగా టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పూర్తిస్థాయి తయారీ యూనిట్ను ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని రేపు (ఫిబ్రవరి 10) ప్రారంభించారు. ఈ ప్లాంట్లో భారత్లోనే తొలిసారిగా ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పూర్తిస్థాయిలో తయారు కానుంది. కాగా, ఈ ప్లాంట్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించగా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సమక్షంలో తొలి వాహనాన్ని ప్లాంట్ నుంచి విడుదల చేశారు. దీంతో భారత్లో గ్లోబల్ ఆటోమొబైల్ హబ్గా తమిళనాడు ప్రాధాన్యం మరింత పెరిగిందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సంచలనం!
Also Read
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
- Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
అయితే, రూ.9,000 కోట్ల పెట్టుబడితో 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ తయారీ కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడిచే ఈ ప్లాంట్లో ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తయారు చేయనున్నారు. ఇందులో ప్రీమియం జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడళ్లతో పాటు టాటా మోటార్స్కు చెందిన కొన్ని ప్యాసింజర్ వాహనాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉత్పత్తి కానున్నాయి.
Read Also: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
ఇక, ఇప్పటికే పుణేలో ఉన్న జేఎల్ఆర్ యూనిట్ ప్రధానంగా అసెంబ్లీ కేంద్రంగా ఉండగా, రాణిపేట ప్లాంట్ పూర్తిస్థాయి తయారీ కేంద్రం కావడం విశేషం. భారత్లో తొలిసారిగా ఒక ప్రీమియం కార్ పూర్తిగా దేశీయ ఫ్యాక్టరీలో తయారవడం ఇదే మొదటిసారి. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్లాంట్కు బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే, సేలం- చెన్నై ఎక్స్ప్రెస్వే ద్వారా బలమైన మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉంది. ఎణ్నోర్, కాటుపల్లి, చెన్నై పోర్టులకు సమీపంలో ఉండటం ఎగుమతులకు అనుకూలంగా మారనుంది. ‘డెట్రాయిట్ ఆఫ్ ఏషియా’గా పేరొందిన చెన్నై ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ను రెండో స్థాయి పట్టణాలకు విస్తరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Read Also: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!
కాగా, యూరప్తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు, అమెరికాతో టారిఫ్ ఒప్పందాల నేపథ్యంలో భారత్ గ్లోబల్ ట్రేడ్లో కీలక పాత్ర పోషించనున్న సమయంలో ఈ పెట్టుబడి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, భారత్లో ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న సంపన్న వర్గం, లగ్జరీ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఇండియా జేఎల్ఆర్కు కీలక మార్కెట్గా మారిందని కంపెనీ పేర్కొంది. 2011 నుంచే భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జేఎల్ఆర్, గత మూడు సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని మూడింతలు పెంచుకుంది. వచ్చే మరో మూడేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక, FY24లో భారత్ నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సాధించిన జేఎల్ఆర్, 4,500 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. FY25 తొలి త్రైమాసికంలో 31 శాతం వృద్ధితో.. దేశంలో లగ్జరీ కార్ల ప్రవేశం ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వాహన మార్కెట్లో కేవలం 1 శాతంగా ఉండటంతో, లోకల్ గా తయారీ చేయడం ద్వారా ధరలు తగ్గించి, వేయిటింగ్ పీరియడ్ను తగ్గించి, మార్కెట్ షేర్ను పెంచుకోవచ్చని జాగ్వార్ కంపెనీ భావిస్తోంది. అయితే, రాణిపేట ప్లాంట్ టాటా మోటార్స్ గ్లోబల్ ఎలక్ట్రిక్, ప్రీమియం వాహన వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పెట్టుబడులకు నమ్మకమైన గమ్యంగా తమిళనాడు స్థానం మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!