Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles India First Luxury Electric Suv Tata Jlr Rs 9000 Crore

Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్‌యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..

Published Date :February 9, 2026 , 12:00 pm
By Chandra Shekhar Pamena
  • భారత్‌లో పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను ప్రారంభించిన టాటా-జెఎల్ఆర్..
  • రూ. 9000 వేల కోట్లతో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ల తయారీ ప్లాంట్..
  • ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్/ డీజిల్ వాహనాలు కూడా తయారు
Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్‌యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Tata- JLR Luxury Electric SUV: భారత్‌లో ప్రీమియం ఆటోమొబైల్ రంగంలో తొలిసారిగా టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని రేపు (ఫిబ్రవరి 10) ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో భారత్‌లోనే తొలిసారిగా ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తిస్థాయిలో తయారు కానుంది. కాగా, ఈ ప్లాంట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించగా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సమక్షంలో తొలి వాహనాన్ని ప్లాంట్ నుంచి విడుదల చేశారు. దీంతో భారత్‌లో గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా తమిళనాడు ప్రాధాన్యం మరింత పెరిగిందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సంచలనం!

Also Read

  • TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
  • Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..
Add as a preferred
source on google

అయితే, రూ.9,000 కోట్ల పెట్టుబడితో 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ తయారీ కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడిచే ఈ ప్లాంట్‌లో ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తయారు చేయనున్నారు. ఇందులో ప్రీమియం జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడళ్లతో పాటు టాటా మోటార్స్‌కు చెందిన కొన్ని ప్యాసింజర్ వాహనాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉత్పత్తి కానున్నాయి.

Read Also: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే

ఇక, ఇప్పటికే పుణేలో ఉన్న జేఎల్‌ఆర్ యూనిట్ ప్రధానంగా అసెంబ్లీ కేంద్రంగా ఉండగా, రాణిపేట ప్లాంట్ పూర్తిస్థాయి తయారీ కేంద్రం కావడం విశేషం. భారత్‌లో తొలిసారిగా ఒక ప్రీమియం కార్ పూర్తిగా దేశీయ ఫ్యాక్టరీలో తయారవడం ఇదే మొదటిసారి. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్లాంట్‌కు బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, సేలం- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా బలమైన మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉంది. ఎణ్నోర్, కాటుపల్లి, చెన్నై పోర్టులకు సమీపంలో ఉండటం ఎగుమతులకు అనుకూలంగా మారనుంది. ‘డెట్రాయిట్ ఆఫ్ ఏషియా’గా పేరొందిన చెన్నై ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌ను రెండో స్థాయి పట్టణాలకు విస్తరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

Read Also: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!

కాగా, యూరప్‌తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు, అమెరికాతో టారిఫ్ ఒప్పందాల నేపథ్యంలో భారత్ గ్లోబల్ ట్రేడ్‌లో కీలక పాత్ర పోషించనున్న సమయంలో ఈ పెట్టుబడి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, భారత్‌లో ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న సంపన్న వర్గం, లగ్జరీ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఇండియా జేఎల్‌ఆర్‌కు కీలక మార్కెట్‌గా మారిందని కంపెనీ పేర్కొంది. 2011 నుంచే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జేఎల్‌ఆర్, గత మూడు సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని మూడింతలు పెంచుకుంది. వచ్చే మరో మూడేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక, FY24లో భారత్ నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సాధించిన జేఎల్‌ఆర్, 4,500 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. FY25 తొలి త్రైమాసికంలో 31 శాతం వృద్ధితో.. దేశంలో లగ్జరీ కార్ల ప్రవేశం ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కేవలం 1 శాతంగా ఉండటంతో, లోకల్ గా తయారీ చేయడం ద్వారా ధరలు తగ్గించి, వేయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి, మార్కెట్ షేర్‌ను పెంచుకోవచ్చని జాగ్వార్ కంపెనీ భావిస్తోంది. అయితే, రాణిపేట ప్లాంట్ టాటా మోటార్స్ గ్లోబల్ ఎలక్ట్రిక్, ప్రీమియం వాహన వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పెట్టుబడులకు నమ్మకమైన గమ్యంగా తమిళనాడు స్థానం మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • greenfield manufacturing facility
  • India luxury electric SUV
  • India premium EV manufacturing
  • Jaguar Land Rover India plant
  • luxury electric SUV India

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions