Fastag New Rules: అలర్ట్.. ఫాస్టాగ్ చెల్లింపుల్లో కొత్త నియమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fastag New Rules: వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రూ.3000లతో ఈ పాస్ కొనుగోలు చేసి ఏడాదంతా లేదా 200 ట్రిప్పులు (ఏది ముందు వస్తే అది) జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్ప్రెస్ వేలపై తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 15, 2025 రోజునే ఈ వార్షిక పాస్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ యాన్యువల్ పాస్ల కోసం వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే.. వాహనదారులు సౌకర్యార్థం కేంద్రం మరో రెండు కొత్త నియమాలు ప్రవేశ పెట్టింది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతల మొత్తం చెల్లించాల్సి వచ్చేది.
READ MORE: Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
Also Read
- Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
- BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
- Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
- Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
ఈ నిబంధనలో స్వల్ప మార్పులు చేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో టోల్ చెల్లించాలనుకుంటే ఎప్పటి మాదిరిగా రెండింతలు కట్టాల్సి ఉంటుంది. కానీ.. యూపీఐ ద్వారా చెల్లిస్తే టోల్ కొంత తగ్గుతుంది. యూపీఐ ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు రూ. 100 చెల్లిస్తే, ఆ సౌకర్యం లేని వాళ్లు నగదు రూపంలో అయితే.. రూ.200 చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం రూ. 125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. అదే విధంగా మీ ఫాస్టాగ్లో డబ్బులు ఉండి.. సక్రమంగా పని చేస్తున్నా.. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఏర్పడితే.. ఉచితంగా వెళ్లవచ్చు. మీరు ఎలాంటి నదగు లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని మరో నియమాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు నియమాలు వచ్చే నెల 15 (నవంబర్ 15) నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
READ MORE: Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!