Fastag New Rules: అలర్ట్.. ఫాస్టాగ్ చెల్లింపుల్లో కొత్త నియమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fastag New Rules: వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రూ.3000లతో ఈ పాస్ కొనుగోలు చేసి ఏడాదంతా లేదా 200 ట్రిప్పులు (ఏది ముందు వస్తే అది) జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్ప్రెస్ వేలపై తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 15, 2025 రోజునే ఈ వార్షిక పాస్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ యాన్యువల్ పాస్ల కోసం వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే.. వాహనదారులు సౌకర్యార్థం కేంద్రం మరో రెండు కొత్త నియమాలు ప్రవేశ పెట్టింది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతల మొత్తం చెల్లించాల్సి వచ్చేది.
READ MORE: Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
Also Read
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
- Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
ఈ నిబంధనలో స్వల్ప మార్పులు చేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో టోల్ చెల్లించాలనుకుంటే ఎప్పటి మాదిరిగా రెండింతలు కట్టాల్సి ఉంటుంది. కానీ.. యూపీఐ ద్వారా చెల్లిస్తే టోల్ కొంత తగ్గుతుంది. యూపీఐ ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు రూ. 100 చెల్లిస్తే, ఆ సౌకర్యం లేని వాళ్లు నగదు రూపంలో అయితే.. రూ.200 చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం రూ. 125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. అదే విధంగా మీ ఫాస్టాగ్లో డబ్బులు ఉండి.. సక్రమంగా పని చేస్తున్నా.. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఏర్పడితే.. ఉచితంగా వెళ్లవచ్చు. మీరు ఎలాంటి నదగు లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని మరో నియమాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు నియమాలు వచ్చే నెల 15 (నవంబర్ 15) నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
READ MORE: Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..