Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష
- పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు
- రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం పాట్లీపుత్ర రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు అభ్యర్థులు రైల్వే పట్టాలపైకి దిగి రైళ్లను అడ్డుకోవడంతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం.
ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించాల్సి ఉండటంతో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభ్యర్థులు రాత్రికి రాత్రే పాట్లీపుత్ర స్టేషన్కు చేరుకున్నారు. అయితే తగినన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో తాము పరీక్షకు సమయానికి చేరుకోలేమనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ప్రత్యేక రైలు రాకతో ఉద్రిక్తత
పాట్లీపుత్ర నుంచి కతిహార్కు వెళ్లాల్సిన పరీక్షల ప్రత్యేక రైలు స్టేషన్కు చేరుకున్న సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన అభ్యర్థులు రైలు ముందు పట్టాలపై కూర్చుని రైల్వే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు రైలు రాకపోకలు స్తంభించిపోయాయి.
రాళ్ల దాడి.. రైలు ధ్వంసం
ఆందోళన కొనసాగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసరడంతో పాటు రైలు బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పలు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.
ఐజీ సహా పలువురు పోలీసులకు గాయాలు
ఈ హింసాత్మక ఘటనలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) జితేంద్ర రాణా, రూపస్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఐజీ జితేంద్ర రాణా, దానాపూర్ ఎస్పీ, ఎస్డీఎం, ఏఎస్పీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలోనే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, అభ్యర్థులను శాంతింపజేసేందుకు పోలీసులు, రైల్వే అధికారులు సంయుక్తంగా ప్రయత్నాలు చేపట్టారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకుని అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!