-
నిజామాబాద్లో విషాదం.. కరోనాతో గంట వ్యవధిలోనే దంపతుల మృతి
కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా.. ఒకే కుటుంబంలో నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా ప్రాణాలు వదులుతున్నారు.. నిన్న జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందగా.. విజయవాడలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నుమూశారు.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇద్దరు దంపతులు కరోనాతో కన్నుమూశారు.. పూర్తి వివరాల్లోకి […] -
కరోనా ఎఫెక్ట్.. యూపీ సర్కార్ కీలక నిర్ణయం
భారత్తో కరోనా మహమ్మారి సేకండ్వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మరో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి […] -
వరంగల్లో కరపత్రాల దుమారం.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం […] -
కరోనా భయం.. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ముళ్ల కంచెలు..
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఇప్పటికే కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు.. ఇక, తెలంగాణకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తుండగా.. కర్ణాటకలోనూ భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో.. సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ మొదలైంది.. హారాష్ట్ర – కర్ణాటక సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కరోనా విజృంభిస్తున కారణంగా.. తెలంగాణ గ్రామాల నుంచి మహారాష్ట్రకు వెళ్లేదారులలో రోడ్లు తవ్వి ముళ్ల కంచెలు వేసి […] -
వైఎస్ వివేకా హత్య కేసు.. ఏబీవీ లేఖకు పోలీసుశాఖ కౌంటర్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు.. […] -
ఆక్సిజన్ ఏజెన్సీల వద్ద ఆస్పత్రులు, అంబులెన్స్ల క్యూ..
కరోనా బాధితుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర కీలకమైనది.. కరోనాబారిన పడి ఆస్పత్రి చేరాడంటేనే ఆక్సిజన్ తప్పనిసరి.. అయితే, వరుసగా కేసులు పెరగడం.. క్రమంగా ఆస్పత్రులకు తాకిడి పెరగడంతో.. ఆక్సిజన్కు కొరత ఏర్పడింది.. దీంతో.. ఆస్పత్రులు, అంబులెన్స్లు సైతం ఆక్సిజన్ ఏజెన్సీల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. విజయవాడలో గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.. మరో మూడు రోజుల్లో నగరంలో నిల్వ ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోతుందని చెబుతున్నారు ఆక్సిజన్ సప్లేయర్స్.. […] -
పవన్ కల్యాణ్కు కరోనా.. ఫామ్హౌస్లో చికిత్స..
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే, […] -
పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ.. ఎమర్జెన్సీ, ఓపీ.. అన్నీ బంద్..
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. మళ్లీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ పోతోంది.. చాలా మంది పరిస్థితి విషమంగా మారి.. తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. దీంతో.. మరోసారి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయానికి వచ్చారు.. శనివారం నుంచి ఓపీ సేవలను నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు.. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే […] -
ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది…
కరోనా వ్యాక్సిన్ నిల్వలు జీరోకు చేరుకోవడంతో.. ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ ఆగిపోయిన పరిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తమకు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. 5 లక్షల డోసుల వ్యాక్సిన్ను ఏపీకి పంపనుంది.. రేపు రాష్ట్రానికి రానున్నాయి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు.. ఫుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శనివారం ఏపీకి చేరుకోనున్నాయి కోవిషీల్డ్ టీకా డోసులు.. మొదట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి […] -
రెండోసారి సీఎంకు కరోనా పాజిటివ్.. అస్వస్థత..! ఆస్పత్రికి తరలింపు
ఇప్పటికే భారత్లో పలువురు ముఖ్యమంత్రులను సైతం పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. ఇప్పటికే ఓసారి కరోనాబారిన పడిన కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప.. మరోసారి ఆ వైరస్కు చిక్కాడు.. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది.. ఈ విషయాన్ని కర్ణాటక సీఎంవో ప్రకటించింది.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు యడ్యూరప్ప.. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో.. ఇప్పుడు అక్కడి నుంచి మణిపాల్ ఆస్పత్రికి తరలించనున్నారు. ఇక, […]
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..