-
కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. వ్యాక్సిన్లో రాష్ట్రాలకు అన్యాయం
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు […] -
టెన్త్, ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం.. త్వరలోనే షెడ్యూల్..
కరోనా సెకండ్ వేవ్ కల్లోలంతో కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కానీ, టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఒక్కటే మాటకు కట్టుబడి ఉంది.. పరీక్షలు ఇప్పుడు వాయిదా పడొచ్చు.. కానీ, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించితీరుతాం అంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం […] -
బీజేపీ మహిళా ఎంపీ కారుపై రాడ్లు, రాళ్లతో దాడి..
భారతీయ జనా పార్టీకి చెందిన మహిళా ఎంపీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లు, రాడ్లతో విరిచుకుపడ్డారు.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ఆమె.. సొమ్మసిల్లిపడిపోయారు.. ఈ ఘటన రాజస్థాన్లో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ ఎంపీ రంజీతా కోలీ.. త రాత్రి ధర్సోనీ గ్రామంలో ఓ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.. తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో భరత్పూర్ జిల్లాలోని ధర్నోనీకి వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్ […] -
కరోనా మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ… మళ్లీ అప్పుడే..!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది […] -
కరోనా ఎఫెక్ట్.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
కరోనా కల్లోలం ప్రారంభమైనప్పట్టి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ నిషేధం విధించింది.. భారత్ నిర్ణయం తీసుకుని దాదాపు 11 నెలలు అవుతుంది.. కరోనా ఫస్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలోనూ నిషేధం పొడిఇస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా, మరో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది.. జూన్ […] -
గుడ్న్యూస్.. 2021లోపే ప్రజలందరికీ వ్యాక్సినేషన్..
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అయితే, సువిశాల భారత దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసేది ఎప్పుడు అనే అనుమాలు ఉన్నాయి.. దానికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా వెంటాడుతోంది.. ఈ తరుణంలో.. శుభవార్త వినిపించారు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్… దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయనున్నట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్పై ప్రతిపక్షాల విమర్శలపై.. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇవాళ్ల ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై […] -
కోవిడ్ను అర్థం చేసుకోలేదు.. వ్యాక్సినేషన్ సరిగాలేదు..!
ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు వ్యాక్సిన్ల కొరతపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ప్రధాని మోడీ గానీ, కేంద్రం గానీ కరోనా సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని మండిపడ్డారు.. కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని.. విస్తరిస్తోన్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుందన్నారు రాహుల్.. మరోవైపు వ్యాక్సినేషన్పై మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించి […] -
ఈ నెల 31 నుంచి దశలవారీగా అన్లాక్.. సీఎం ప్రకటన
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్డౌన్ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్లాక్కు వెళ్లనున్నట్టు వెల్లడించారు […] -
డీఆర్డీవో 2 డీజీ ఔషధం ధర ప్రకటన..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సినేషన్పై ఫోకస్ పెట్టింది సర్కార్.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. త్వరలోనే వ్యాక్సిన్ కష్టాలు తీరిపోనున్నాయి.. మరోవైపు.. కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని ఇప్పటికే విడుదల చేసింది కేంద్రం… ఇక, ఇవాళ పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔషధం ధరను ఫిక్స్ చేశారు.. ఈ ఔషధం […] -
ట్విట్టర్పై కేంద్రం సీరియస్…
కొత్త నిబంధనలు ఇప్పుడు భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను మరింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది […]
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!