పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను […]
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ […]
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.. గత బులెటిన్తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 2,421 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. ఇదే సమయంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య […]
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. […]
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయింది.. ఆందోళనలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ నిర్వహించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం తప్పుబడుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఉపయోగం ఉండదన్న ఆయన.. ఛలో విజయవాడ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్యయానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో […]
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండగా.. కాల్పులకు తెగబడ్డారు.. మీరట్లోని (ఉత్తరప్రదేశ్లోని) కితౌర్లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్ పాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు దుండగులు పాల్గొన్నట్టు పేర్కొన్న ఆయన.. తాను ప్రయాణిస్తున్న […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి.. ఇదే సమయంలో టెస్ట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది.. గత బులెటిన్లో 5,983 పాజిటివ్ కేసుల నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,578 శాంపిల్స్ పరీక్షించగా.. 4,605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 10 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. అనంతపురం, కడప, కర్నూలులో ఇద్దరు చొప్పున, […]
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం […]
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఉద్యమం ఉధృతం అవుతోంది.. ఇవాళ ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది.. అయితే, ఉద్యోగుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేసిన ఆయన.. చర్చలతోనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు.. కానీ, ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు.. ఉద్యోగుల వెనుక ఆయన ఉన్నారు కాబట్టే.. సంఘాల నేతలు ఈ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని […]