గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.. 182 సీట్లకు గాను 156 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది.. 53 శాతానికి పైగా ఓట్లను సాధించింది బీజేపీ.. అయితే, ఇదే సమయంలో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి… ఏకంగా 5,01,202 మంది ఓటర్లు.. బరిలో ఉన్న ఏ అభ్యర్థి తమకు నచ్చలేదంటూ నోటాపై నొక్కారు.. […]
ఓ 18 ఏళ్ల కుర్రాడు కొత్త చరిత్ర సృష్టించాడు.. అమెరికాలో అతి పిన్న వయస్కుడైన మేయర్గా చరిత్రకెక్కాడు.. యూఎస్లోని అర్కాన్సాస్లోని ఒక చిన్న పట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్గా ఎన్నికయ్యాడు 18 ఏళ్ల జైలెన్ స్మిత్.. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డు సృష్టించాడు.. స్థానిక మీడియా ప్రకారం, అతను తన ప్రత్యర్థి మాథ్యూస్పై 185 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.. జైలెన్ స్మిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నత పాఠశాల […]
తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తేదీ చాలా ప్రత్యేకమైనది.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 2009 డిసెంబర్ 9న తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లభించింది.. ఉవ్వెత్తున్న ఎగసిన ఉద్యమం ఓవైపు, ఆత్మబలిదానాలు మరోవైపు, ఉద్యమనేత కేసీఆర్ అకుంఠిత దీక్ష.. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణపై ప్రకటన చేసింది.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ […]
* నేటి నుంచి ఫిఫా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్ * బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం * శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ * నేడు మధ్యాహ్నం 1.20కి […]
గుజరాత్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకుంది.. 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది.. 2002లో 127 సీట్లు కైవసం చేసుకోగా.. 2007లో 117 స్థానలు.. 2012లో 115 స్థానాలు, 2017లో 99 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇప్పుడు 150 స్థానాలను దాటేసి 160 వైపు సాగుతుంది.. దీంతో, కమలం పార్టీ శిబిరంలో జోష్ పెరిగింది.. ఇక, మరోసారి […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.. అయితే, నియోజకవర్గ అభివృద్దికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అన్నారు కోమటిరెడ్డి… రాబోవు ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ది పైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్లో కొనసాగుతారా? మరోపార్టీలో […]
బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. నిన్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆమె.. సీఎం కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. దుబాయి గురించి మాట్లాడుతున్నావ్.. నేను 25 దేశాలకు వెళ్లాను.. స్వయంగా ప్రభుత్వమే నన్ను అమెరికాకు పంపించి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న.. ఒళ్లు […]
ఆంధ్రప్రదేశ్ వైపు మరోతుఫాన్ దూసుకొస్తుంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్గా బలపడింది. అయితే ఈ తుఫాన్ కి ‘మాండూస్’గా నామకరణం చేశారు. కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైఉన్న తుఫాన్.. పశ్చిమ-వాయువ్య దిశగా పనయిస్తోంది.. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని […]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడం లాంఛనమే అంటున్నారు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ దసరా రోజు ఆ పార్టీ నేతలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు పార్టీ ప్రతినిధులు.. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది.. దీంతో ఏ క్షణంలోనైనా […]
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్న్యూస్ కూడా చెప్పింది.. ఆన్లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లోనే ఆప్డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ […]