Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Harish Rao : కాంగ్రెస్ ఎగవేత… కోతల ప్రభుత్వం…
కాంగ్రెస్ ప్రభుత్వం జులై, ఆగస్టు నెలలో 10 రోజులు కావస్తున్నా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వలేదని మాజీ మంత్రి టీ హరీష్ రావు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాము వాగ్దానం చేసిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. వానకాలం పంట కాలం ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం రైతు భరోసా ఆర్థిక సాయం విడుదల చేయలేకపోయింది. రైతుబంధు సాయాన్ని జూన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసేదని, రైతు […] -
CM Revanth Reddy : తెలంగాణకు స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. తరగతులు నుంచి బయటకు వచ్చి విద్యార్థులు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు […] -
Minister Seethakka : మలక్ పేట ప్రభుత్వ హస్టల్ ఘటనపై మంత్రి సీతక్క సమీక్ష
మలక్ పేట లోని ప్రభుత్వ అందబాలికల హస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ఆ రోజు తనకు అధికారులిచ్చిన సమాచారాన్నిమాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు. తాను చేసిన మాటలను వక్రీకరించ వద్దని హితవు పలికారు. ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల బాద్యతతో వ్యహరించాలని కోరారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యహరిస్తోంది..ఎవరికి ఏలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏవరు కోరినా కేసు […] -
Ponguleti Srinivas Reddy : ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉంది కేసీఆర్ నిర్వాకం
ఎనకట ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం కూడా ఆలాగే ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తన పుట్టినిల్లు అయిన చింత మడక గ్రామంలో సిఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ […] -
CM Revanth Reddy : అమెరికాలోని గూగుల్ హెడ్క్వార్టర్స్ను సందర్శించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో తెలంగాణ బృందం గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో ఉత్పాదక చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, AI సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన , ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి […] -
Kishan Reddy : తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటిన కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతు.. అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మొక్క నాటిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని […] -
Kuwai Trap : కువైట్ ఎడారిలో చిక్కుకున్న తెలంగాణ వ్యక్తి.. సహాయం కోసం వేడుకోలు
కువైట్ ఎడారి నుండి ఒంటెల కాపలాకు గురవుతున్న తనను రక్షించాలని తెలంగాణకు చెందిన వలస కార్మికుడు రాథోడ్ నామ్దేవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , భారత అధికారులను వేడుకున్నాడు. ఆన్లైన్లో వెలువడిన బాధాకరమైన వీడియో సందేశంలో, తెలంగాణలోని నిర్మల్ జిల్లా, ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన నామ్దేవ్ను ఢిల్లీకి చెందిన రిక్రూటింగ్ కంపెనీ హౌస్కీపర్ వీసాపై కువైట్కు పంపింది. అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత, అతను కఠినమైన ఎడారి వాతావరణంలో ఒంటెల కాపరిగా పని చేయవలసి […] -
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం
ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడు పేట గ్రామంలో సియం ఆర్ యప్ చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. నిత్యము ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, ప్రజల ఆశిస్సుల మేరకు ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలను జోడెద్దుల్లాగా నడిపిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్ష […] -
DG Shikha Goel : తెలంగాణ వ్యాప్తంగా మహిళల భద్రత, షీ టీమ్లపై సమీక్ష
రాష్ట్రంలో మహిళల భద్రతపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు, సిబ్బందితో ఆగస్టు 8వ తేదీ గురువారం నాడు డిజి (మహిళా భద్రత) తెలంగాణ శిఖా గోయెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 300 మంది అధికారులు, సిబ్బంది సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. షీ టీమ్లు ఇప్పటివరకు రూపొందించిన ‘బలమైన భద్రతా అవగాహన’పై శిఖా గోయెల్ చాలా దృష్టి పెట్టారు. ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి […]
తాజావార్తలు
-
LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
-
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
-
Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?
-
Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..