కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది.. వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు […]
వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్ నుంచి ఆ సందేశం పంపిన సబైర్ నేరగాడు డబ్బులు ఫోన్పే చేసి, స్ర్కీన్షాట్ షేర్ చేయాలని కోరాడు. పలువురికి మేసేజ్లు పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే […]
ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న […]
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, […]
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ […]
జగిత్యాల మార్కెట్లో మామిడి పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో జోరుగా ప్రారంభమైన వ్యాపారం క్రమేపీ తగ్గుముఖం పట్టిందని, పండ్ల నాణ్యత తక్కువగా ఉండడంతో నివేదికలు అందుతున్నాయి. జగిత్యాల పట్టణం శివార్లలో ఉన్న చెల్గల్ మామిడి మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. జగిత్యాల మామిడిపండ్లు ప్రసిద్ధి చెందినందున, వేసవిలో పంటను కొనుగోలు చేయడానికి వివిధ ఉత్తర భారత రాష్ట్రాల నుండి వ్యాపారులు కూడా ఇక్కడకు వస్తారు. అయితే, ఈ సంవత్సరం ప్రకృతి విభిన్న ప్రణాళికలను […]
భోజ్పురి నటుడు, సింగర్ పవన్ సింగ్పై బీజేపీ వేటు భోజ్పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది. పవన్ సింగ్ బీహార్లోని కరకత్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు. విత్డ్రా చేసుకునేలా బుజ్జగించినా వినకపోవడంతో తాజాగా బీజేపీ అధిష్టానం వేటు వేసింది. ఇదిలా ఉంటే గతంలో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ టిక్కెట్ను […]
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమస్యలపై తదుపరి అధ్యయనాల బాధ్యతలు చేపట్టిన మూడు కేంద్ర సంస్థల్లో ఒకటైన పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) తన నిపుణుల బృందాన్ని బుధవారం రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధినిర్వహణలో అత్యవసర దృష్ట్యా బృందం మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ వద్ద విచారణ ప్రారంభించింది. గురువారం ప్రాథమిక కసరత్తు నిమిత్తం బుధవారం రాత్రికి అన్నారం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది . CWPRS […]
పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి శ్రీ ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా […]
వరంగల్ హంటర్ రోడ్డు లోని నాని గార్డెన్లో ఏర్పాటు చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి…. మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవని ఆయన ఆయన పేర్కొన్నారు. నిన్న […]