తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని […]
కిర్గిజిస్తాన్ లోని బిష్కెక్లో భారతీయ విద్యార్థులపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మరియు తెలంగాణ విద్యార్థులకు అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతీయ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థులకు మరియు ఈజిప్టు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తరువాత, బిష్కెక్లో హింస చెలరేగడంతో భారతీయ విద్యార్థులపై స్థానికులు దాడులకు దారితీసింది. ఈ దాడులకు సంబంధించిన అనేక వీడియోలు […]
ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే తాండూర్ నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 గంటలు గడవకముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల […]
దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే.. అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో చెప్పనక్కర్లేదు. మధ్య తరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే.. ఆ బ్యాంకులోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటి ఏకంగా ఎక్కడ లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాం […]
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు […]
ప్రమాదం జరిగినప్పుడు స్పందించే విధానంతోనే ఆ ప్రమాద ప్రభావం ఉంటుంది. మన చుట్టప్రక్కల ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంటే ఓ సారి ఊహించుకోండి.. ఇలాంటప్పుడు చాలా వరకు తమను తాము కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నాలే చేస్తారు. అయితే.. ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా.. లేక ప్రమాద తీవ్రతను తగ్గించడానికైనా ముందుకు వచ్చి ప్రయత్నాలు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన.. ఓ పెట్రోల్ బంక్లో డిజీల్ కొట్టించుకునేందుకు వచ్చిన లారీ డిజీల్ […]
వేసవి తాపం నుంచి వాహనదారులను రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో హిమాయత్ నగర్లోని లిబర్టీ రోడ్డులో గ్రీన్ మెష్ ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రధాన జంక్షన్లలో, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోయే జంక్షన్లలో ఇలాంటి షేడ్ కానోపీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏరియా ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవిలో బాటసారులకు విశ్రాంతి కల్పించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం మెష్ను ఏర్పాటు […]
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది.. బత్తిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబీకులచే వార్షిక ‘చేప ప్రసాదం’ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే […]
ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్ రావు. ముప్పై […]
ప్రపంచంలోని వివిధ విషయాలపై రికార్డులు ఉన్నాయి. అతిపెద్ద నగరం, అతిపెద్ద దేశం, అతిపెద్ద భవనం మొదలైన వాటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు భారతదేశంలో ఉంది. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని శివపూర్లోని బొటానికల్ గార్డెన్స్లో ఉంది. ఈ బొటానికల్ గార్డెన్లో సాల్, సీబీ, టేకు, మర్రి, అశ్వత్త, మహోగని, లవంగం, జాజికాయ […]