Gogikar Sai Krishna
Author- NTV Telugu-
శ్రీనగర్లో ఉగ్రదాడి.. తిప్పికొట్టిన ఆర్మీ..
శ్రీనగర్లోని బెమీనాలో గల స్కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఆసుపత్రిలోని సిబ్బందిని, పౌరులను అడ్డుపెట్టుకొని తప్పించుకున్నట్లు శ్రీనగర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ పోలీసులు, భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
విజయవాడకి డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదు : సీపీ బత్తిన శ్రీనివాసులు
విజయవాడ కేంద్రంగా ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్ ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణపై నిఘా పెట్టామని, విజయవాడకి డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అడ్రస్ని మాత్రం 2 సార్లు ఉపయోగించారని, డ్రగ్స్ రాకెట్ అంత ఢిల్లీ కేంద్రంగా జరిగిందని ఆయన వెల్లడించారు. యాక్టివుగా […] -
పోలీసుల కస్టడీకి కిరణ్ గోసావి..
చీటింగ్ ఆరోపణలపై పూణె సిటీ పోలీసులు అరెస్టు చేసిన కిరణ్ గోసావిని సిటీ కోర్టు నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి పంపింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో కిరణ్ గోసావి సాక్షిగా ఎన్సీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కిరణ్ గోసావిని విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరగా సిటీ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ గత నెలలో నిషేధిత […] -
టీడీపీ నేతలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే
గురజాల అభివృద్ధిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అంటూ గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. గురజాలలో టీడీపీ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. దాచేపల్లి నడిసెంటర్లో అయినా సరే, బొడ్రాయి సెంటర్ లో అయినా సరే, చర్చకు నేను ఒక్కడినే వస్తా, లెక్కలు తేల్చుకొని వెళ్తా, టీడీపీ వారు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు […] -
విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగింది : పయ్యావుల కేశవ్
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్ […] -
యూరప్ను హెచ్చరించిన డబ్ల్యూహెచ్వో
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాప్తి చెంది ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి దేశాలు కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొన్ని దేశాల్లో కోవిడ్ టీకాలు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి. అయితే యూరప్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్వో) యూరప్కు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్లో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి […] -
రేపు కేదార్నాథ్లో మోడీ పర్యటన..
యూపీలోని కేదార్నాథ్లో రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోడీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అతిపెద్దగా రాష్ట్రమైన యూపీలో 404 అంసెబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2017 యూపీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు అధికంగా సీట్లు సాధించడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు […] -
దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు
ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకొనే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురి కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. దీపావళి సందర్బంగా టపాసులు కాలుస్తుండగా ఏడుగురు గాయాలయ్యాయని.. వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంవో నాజాఫి బేగం తెలిపారు. మరో ఇద్దరిని మాత్రం […] -
అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు
వాషింగ్టన్ డీసీలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దీపావళి వేడుకల్లో అమెరికా ప్రజాప్రతినిధులు పాల్గొనడం విశేషం. అంతేకాకుండా చీకటిని తొలగించే సత్యం, జ్ఞానాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ డెమొక్రటిక్ క్లబ్లో ప్రముఖులు దీపాలు వెలగించారు. ఎన్ఆర్ఐలు, అమెరికన్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తొలిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై దీపావళి థీమ్ను ప్రదర్శించారు. న్యూయార్క్లోని హడ్సన్ నదీతీరంలో […] -
కళ్లు చేమర్చేలా చేసిన కళాకారుడు..
కళాకారులు కళానైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ… అదే కళాకారుడు ఓ హీరోకు వీరాభిమాని అయితే.. ఆ హీరో మరణిస్తే.. అప్పుడు తన గుండెలోతులోంచి వచ్చిన ఆలోచనను పెయింటింగ్ వేశాడో అభిమాని. ఆ పెయింటింగ్ చూసిన వారు కళ్లు చేమర్చక మానరనడంలో సందేహం లేదు. ఇంతకు ఎవరిదీ పెయింటింగ్ అనుకుంటున్నారా.. ఇటీవల గుండె పోటు మృతి చెందిన పునీత్ తన తండ్రి రాజ్ కుమార్ను స్వర్గంలో కలుసుకున్నట్లు ఆ పెయింటింగ్ చెబుతోంది. బెంగుళూరుకు చెందిన కరణ్ ఆచార్య […]
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!