టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్లోని హైటెక్స్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ […]
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు 64 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, సీనియర్ సైంటిఫిక్ అధికారి, మెడికల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కొరకు నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్లోని పూర్తి వివరాల కోసం upsconline.nic.in వైబ్ […]
ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డి ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్చేయాలి, విద్యాపరంగా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటన్నది కనిపించాలని ఆయన అన్నారు. వీసీలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి, ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకు వచ్చామని, డిగ్రీని నాలుగేళ్ల కోర్సు […]
ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్ […]
ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్పీఎఫ్ […]
ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత 15మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పతనం మొదలైందని, చాలా మంది నేతలు టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. గాంధీ భవన్లోకి గాడ్సే […]
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్) కోర్సులో ప్రవేశాల కొరకు వర్సీటీ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. కన్వీనర్, యాజమాన్య కోటలో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సీటీ వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు వరకు చివరి దశ వెబ్ అప్షన్ నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు http://knruhs.telangana.gov.in/ లో వెబ్ సైట్లో వెబ్ ఆప్షన్లలో వారివారి ప్రాధాన్యతను బట్టి కళాశాలలను ఎంచుకోవాలని […]
నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పట్టణంలో మురళీధర్ రావు ఫ్లెక్సీ పెట్టారు.. కానీ స్టాంప్ సైజులోనైనా సంజయ్ బొమ్మ కూడా పెట్టలేదు.. విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు.. లు నిన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారో బండి […]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. మరి హరీశ్రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్, హరీశ్రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారన్నారు. అంతేకాకుండా 2009 ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న […]