NTV WebDesk
Author- NTV Telugu-
ఇండియాలో రెండు కోట్లు దాటిన పాజిటివ్ కేసులు
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు […] -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఎయిర్ పోర్ట్ లోకి వారికి మాత్రమే అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతి ఉంటుంది. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. […] -
కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో తెలుసా?
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో మళ్ళీ ఒక్కొక్క రంగం తిరిగి మూతపడుతున్నది. దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దేశంలో ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. లాక్ డౌన్ పెట్టాలనే ఒత్తిడి పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను విధించారు. […] -
తిరుమలలో అగ్నిప్రమాదం: పలు దుకాణాలు దగ్ధం
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. -
తెలకపల్లి రవి: అయిదు రాష్ట్రాల ఎన్నికలు, బిజెపికి పగ్గాలు
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలే తిరిగి వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారుతున్నా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వస్తున్నారు. కనుకనే ఈ అయిదు ఎన్నికలు ఒకే పాఠం ఇస్తున్నాయి. అన్నిటిలోకి అత్యంత నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ […] -
బిల్ గేట్స్ దంపతులు సంచలన నిర్ణయం: పెళ్ళైన 27 ఏళ్ల తర్వాత …
బిల్ గేట్స్ దంపతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా […] -
మే 4, మంగళవారం దినఫలాలు
మేషం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి వంటివి ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులపై దృష్టిసారిస్తారు. వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల మందు వ్యక్తి విషయాలు వెల్లడించడం మచిదికాదని గమనించండి. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. […] -
మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్ […] -
టిఎంసి కోటను బద్దలు కొట్టిన సామాన్యురాలు
తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. 221 కైవసం చేసుకొని రికార్డ్ సాధించింది. నందిగ్రామ్ లో మమత బెనర్జీ ఓటమిపాలైనప్పటికీ తృణమూల్ విజయం సాధించింది. అయితే, బెంగాల్ లోని సల్తోరా నియోజక వర్గంపై ఇప్పడు అందరి దృష్టి పడింది. ఆ నియోజక వర్గంలో రోజువారీ పనులు చేసుకొని జీవనం సాగించే దినసరి కూలి చందనా బౌరి బీజేపీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన చందనా బౌరి […] -
జడ్చర్ల… కొత్తూరులో కారు జోరు…
తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీని తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులు ఉండగా, 19 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో 16 వార్డులను తెరాస పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటె రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో ఏడు వార్డుల్లో తెరాస […]
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!