NTV WebDesk
Author- NTV Telugu-
Nara Lokesh: జగన్ కి నవ్వుతూ అబద్ధాలు ఆడడం అలవాటు
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేశారు. నాలుగు రోజులైనా జంగారెడ్డి గూడెం మరణాలపై నాలుగు రోజుల పాటు సాగదీస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శలు అర్ధరహితం. ప్రజల ప్రాణాలకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రజా సమస్యలపై మేం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. సీఎం జగన్ అబద్దాలకు అలవాటు పడ్డారు. నవ్వుతూ అబద్దాలు ఆడడం జగనుకు అలవాటైంది. జంగారెడ్డి గూడెం కల్తీ మరణాలు […] -
Sailajanath: జంగారెడ్డిగూడెం ఘటనపై హెచ్చార్సీకి కంప్లైంట్
ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా […] -
Srikalahasti Temple: ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్.. ఇద్దరికి మోమోలు
తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు […] -
Meena Jewellers Case: మీనా జువెల్లర్స్పై సీబీఐ మూడు కేసులు
బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్కు చెందిన మీనా జువెల్లర్స్పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అయిన ఉమేష్ జేత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్ ప్రైవేట్ […] -
Congress G23 Meet: డిన్నర్ మీట్లో అసమ్మతినేతల హాట్ డిస్కషన్
కాంగ్రెస్ అసమ్మతి నేతల డిన్నర్ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల “డిన్నర్ సమావేశం పార్టీలో సోనియా విధేయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అజాద్ నివాసంలో “డిన్నర్ సమావేశానికి” హాజరయ్యారుకపిల్ సిబల్, శశి థరూర్, మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, రాజ్ బబ్బర్, పి.జే.కురియన్, మణిశంకర్ అయ్యర్. అదనంగా ఈ రోజు “అసమ్మతి నేతల […] -
Vidyaranya Died: సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య ఇకలేరు
కలం మూగబోయింది. సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ విద్యారణ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్ దినపత్రికలలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. కెరియర్ ప్రారంభంలో హిందూస్థాన్ సమాచార్ కు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా వున్నారు. వారి హఠాన్మరణం జాతీయవాద పాత్రికేయులకు తీరనిలోటు అని పలువురు పాత్రికేయులు నివాళులర్పిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు, సౌమ్యుడు, జాతీయవాది విద్యారణ్య కామ్లేకర్ కన్నుమూశారు. కామ్లేకర్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం […] -
Vizag New TownShips: కొత్త టౌన్ షిప్లతో ఇంటియోగం
గ్రేటర్ విశాఖ నగరం పరిధిలో కొత్త టౌన్ షిప్పులు రానున్నాయ్. ఆరువేల ఎకరాల్లో లే అవుట్ల అభివృద్ధి బాధ్యతను వీఎంఆర్డీఏకి అప్పగించింది ప్రభుత్వం. లక్షా 83వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జీవీఎంసీ పరిధిలో నివాస స్ధలాల కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదలకు ఊరట లభించింది.భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభివృద్ధి పనులకు యంత్రాంగం రెడీ అవుతోంది. పది మండలాల పరిధిలో ఇప్పటికే సేకరించిన […] -
Teacher Posts: టెట్ పరీక్షలపై బీఈడీ అభ్యర్ధుల ఆందోళన
తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం.. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఉపాధ్యాయు పోస్టులు కూడా ఎక్కువగా ఉండటంతో డీఎస్సీ అభ్యర్థులు ప్రిపరేషన్లో పడిపోయారు. అయితే.. టెట్ విషయంలోనే కాస్త గందరగోళం నెలకొంది. బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లు.. టెట్ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణమేంటి? ఓవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నా.. కొందరు అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఇంటర్, డిగ్రీలో బయాలజీ చదివిన వారికి.. ఇప్పుడు […] -
Congress Vs G23 Meet: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. వరుస పరాజయాల నేపథ్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని తిరిగి పట్టాలెక్కించడం సాధ్యమా? గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. గులాం నబీ అజాద్ నివాసంలో సమావేశానికి హాజరుకానున్నారుమనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ వంటి నేతలు. జి-23 అసమ్మతి బృందంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి కూడా హాజరవుతారు. ఇటీవల […] -
National Green Tribunal: తెలంగాణ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్
అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT). నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కన్నెర్ర జేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటి. పిసటి […]
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!