-
మైనంపల్లి సంగతి తెలిసే బీజేపీ చేర్చుకోలేదు : రాజా సింగ్
ఎమ్మెల్యే మైనంపల్లి పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆహారహం వ్యక్తం చేసాడు. మైనంపల్లి నీకు సిగ్గు లేదు. బీజేపీ లో చేరేందుకు ప్రయత్నించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నీ సంగతి తెలిసే బీజేపీ చేర్చుకోలేదు అన్నారు. ఇప్పుడు నీవు అటు టీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి కాకుండా పోయావు. నీ మీద ఎఫ్ఐఆర్ అయిందంటే అర్థం చేసుకో.. సీఎం ఆదేశాలతోనే నీ మీద కేసు. నీ చెవుల్లో నుండి […] -
తోడేళ్ళుగా విరుచుకుపడుతున్నారు : ఈటల
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు […] -
రాజేంద్రనగర్ నిర్మాణాలను కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులు…
రాజేంద్రనగర్ పుప్పాల్ గూడాలో కాందిశీకుల భూములలో వున్న నిర్మాణాలను కూల్చి వేస్తుంది రెవెన్యూ అధికారులు. పుప్పాల్ గూడాలోని సర్వే నెంబర్ 325, 326, 301, 303, 327, 328 గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చి వేసింది అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు. కూల్చివేతను అడ్డుకున్న రైతులు. రైతులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం. పరిస్థితి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిర్మాణాలలో నివాసం వున్న మహిళలను బలవంతంగా బయటకు […] -
శ్రీ శ్రీనివాస కళ్యాణం…
”ది చెన్నై సిల్క్స్ మరియు కుమరన్ గోల్డ్ & డైమెండ్స్” వారు స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర శ్రావణ శుక్ల చతుర్దశి తేదీన అనగా 21-08-2021 శనివారం నాడు ఉదయం 7 గంటలకు ”శ్రీ శ్రీనివాస కళ్యాణంను” నిర్వహిస్తున్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ది చెన్నై సిల్క్స్ భవనం 4 వ అంతస్థులో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శిష్య బృందం ఈ […] -
స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ ఘటన జరగడం బాధాకరం…
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద బీటెక్ విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య ను ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి దారుణం జరగటం బాధాకరం అని తెలిపారు. గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతిని హత్య చేసిన దుర్మార్గుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు అని పేర్కొన్నారు. […] -
తెలంగాణలో మూడు వందలకు దిగువగా కరోనా కేసులు…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందల దిగువగా చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 582 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380 కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 6,41,270 కు పెరిగింది… […] -
మన దేశం వైపు టెర్రరిస్టులు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది : సీపీఐ నారాయణ
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడులకు సంబంధించిన అంశంలో భారత ప్రభుత్వం స్పందించాలి. టెర్రరిస్టులు మన దేశం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది అని సీపీఐ నారాయణ అన్నారు. ముందే మనం కూడా మేల్కొంటే.. అందరికీ మంచిది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గం. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ అమ్మేస్తున్నారు. కోవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారు. ప్రధాని చెప్పేవన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో మాత్రం […] -
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ వాళ్ళు దళితబంధు ఆపాలని కుట్రలు […] -
ఏపీలో నేడు ఎన్ని కరోనా కేసులంటే…?
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 65,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 16 మంది మృతిచెందారు.. మరోవైపు.. 24 గంటల్లో 1,835 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,93,697 కు చేరుగా.. ఇప్పటి వరకు 13,647 మంది మృతిచెందారు.. రికవరీ […] -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసిన పోలీసులు
మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై కేసు నమోదు చేసారు పోలీసులు. సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేసారు. మైనంపల్లి హనుమంతరావు మరియు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేసారు. ఇక ఇదిలా ఉంటె బీజేపీ పార్టీ అదేక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు రేపు బంద్ ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. ప్రతి ఒక్కరు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడికి నిరసనగా బంద్ లో […]
తాజావార్తలు
-
Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
-
Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
-
Tesla Model Y L: టెస్లా మోడల్ Y కొత్త L వేరియంట్ విడుదల.. 661KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
ట్రెండింగ్
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!