పెరుగుతున్న కనెక్టివిటీ, సాంకేతిక పురోగమనాల యుగంలో స్మార్ట్ కార్లు పెరిగిపోతున్నాయి. అధునాతన ఫీచర్లతో వినియోగదారులను స్మార్ట్ కార్లు ఆకట్టుకుంటున్నాయి. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో మీ వాహనమే మీపై గూఢచర్యం చేస్తూ, మీ వ్యక్తిగత జీవితంతో సహా ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉండవచ్చు.
దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు.
జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్కు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
న్యూ ఢిల్లీ అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి యూఎన్ రికార్డులలో ఇండియా పేరును భారత్గా మారుస్తుందని గ్లోబల్ బాడీ ప్రతినిధి ఈరోజు వెల్లడించారు.
ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం జరిగింది. రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
సెప్టెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చేపట్టారు.