Serial Killer: ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం జరిగింది. రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరరూప రాక్షసుడు వేశ్యలను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేశాడు. ఆ సీరియల్ కిల్లర్ ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.
Also Read: AP News: NTV ఎఫెక్ట్.. ఎమ్మిగనూరులో శిశువు మృతిపై విచారణ
ఆ సీరియల్ కిల్లర్ను కిగాలీ పోలీసులు ఈ ఏడాది జులైలో దోపిడీ, అత్యాచారం, ఇతర ఆరోపణలపై అరెస్ట్ చేయగా.. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పట్టువదలని పోలీసులు ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంటిలో మరోసారి తనిఖీలు చేపట్టగా, కిచెన్లో పాతిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి. ఆ కిచెన్లో 10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఆ నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసి విచారించగా.. మరో నలుగురు వేశ్యల మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్లు తెలిపాడు. కుటుంబాలకు దూరంగా ఉండే వేశ్యలను, పెద్దగా స్నేహితులు లేని వేశ్యలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు విచారణలో తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ సీరియల్ కిల్లర్ చేతిలో హతులైన వారిలో కొందరు మగ వేశ్యలు కూడా ఉన్నారట. ఇతడి వివరాలను తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.