ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత జాబితా విడుదల అయింది. 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో ప్రకటించిన అభ్యర్థులు వీరే..
ఇక్కడ కేసీఆర్ ఉన్నారు? అక్కడ ఎవరు ఉన్నారు? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ దే హాట్రిక్ అంటూ మంత్రి వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా నేతలు జాయిన్ అయ్యారు.
రేపు తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే, ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం టీకాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.
సూర్యాపేటలో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు.