Ap Legislative Council: శాసనమండలిలో మారనున్న బలాబలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ శాసనమండలి స్వరూపం మారనుంది. శాసనమండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది బీజేపీ. శాసనసభలోనూ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లభించలేదు. ఇటు శాసనమండలిలో ఇటీవలి వరకూ ఆ పార్టీ నేత పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఆపార్టీకి లేకుండా పోయింది. దీంతో చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రాతినిధ్యం లేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది.
Read Also: Revanth reddy: నిరుద్యోగ నిరసనకు పిలుపు.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
Also Read
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?
ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి. టీడీపీరి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు. ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మహిళా నేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో కొత్తగా వీరు శాసనమండలి మెట్లు ఎక్కనున్నారు. వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు.
మండలిలో ప్రస్తుత వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం టీడీపీ -10
పీడీఎఫ్- 2
ఇండిపెండెంట్: 1
జులైలో గవర్నర్ కోటాలో భర్తీ కానున్న మరో 2 ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి జూలై నాటికి 47కు చేరనుంది వైసీపీ బలం.
Read Also: Mekapati Chandrasekhar Reddy: మేకపాటి మిస్సింగ్.. ఎక్కడికెళ్ళినట్టు?
తాజావార్తలు
-
Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
PoK: ఆక్రమిత కాశ్మీర్ను ‘‘పంజాబ్’’గా మారుస్తున్న పాకిస్తాన్..
-
Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
-
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!