NTV Telugu Site icon

రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి..!

Margani Bharat

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఆ పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మార‌రు.. గ‌తంలోనే ర‌ఘురామ‌పై లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. తాజాగా.. రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ చీప్ విప్ మార్గాని భ‌ర‌త్.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞ‌ప్తి చేశారు.. వైసీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయ‌న‌.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నార‌ని.. అందుకు రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి కోరారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ర‌ఘురామ‌ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను సమర్పించామని, అనేక పర్యాయాలు.. అన‌ర్హ‌త వేటుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన‌ట్టు ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు మార్గాని భ‌ర‌త్. కాగా, త‌న‌పై న‌మోదైన రాజ‌ద్రోహం కేసుల‌పై రోజుకు ఒక‌రిని అనే త‌ర‌హాలో వ‌రుస‌గా.. వివిధ రాష్ట్రాల సీఎంలు, గ‌వ‌ర్న‌ర్లు, నేత‌ల‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లేఖ‌లు రాస్తున్న సంగ‌తి తెలిసిందే.