Nedurumalli Ramkumar Reddy: బ్రష్టుపట్టించాలనే ఇలా చేశారు..’ఆనం’పై నేదురుమల్లి విమర్శల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nedurumalli Ramkumar Reddy Slams Anam Ramanarayana Reddy: అనేక ప్రచారాల అనంతరం తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా ప్రకటించారు. వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరే అవకాశం ఉందని రామనారాయణ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. నిజానికి ఆయన ముందు నుంచి పార్టీకి దూరం అవుతారనే సూచనలతో వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు తాజాగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయం మొదటి నుంచి ఊహించిందేనని అన్నారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
మంత్రి పదవి రాలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారని, గడచిన నాలుగు సంవత్సరాలలో వెంకటగిరిని కలుషితం చేశారని అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాలు చేశాడని పేర్కొన్న ఆయన మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూశాడని ఆరోపించారు. వైసీపీని బ్రష్టుపట్టించాలనే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశాడని, నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ ఆపాడని అన్నారు. ఆనం విషయం తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పెట్టారని, వెంకటగిరి మున్సిపాలిటీలోని జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలు బయటపెడతానని ఆయన హెచ్చరించారు. రాజకీయ చరిత్ర అని చెప్పుకునే ఆనం కుటుంబం ఎంత మందిని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసింది? అని ప్రశ్నించారు.
Also Read: YV Subba Reddy: టీడీపీ ట్రాప్లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి కౌంటర్
ఇక నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి పై జరిగిన దాడి హేయమైన చర్యేనని పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఘటనను ఆ రోజు ఆనం రామనారాయణరెడ్డి బ్లాక్ డే అన్నారు, కానీ అదే ఆనం వెంకటరమణారెడ్డిపై గతంలో ఆనం రామనారాయణరెడ్డి కర్ర తీసుకుని వెళ్లారు, ఆ ఘటనపై పోలీసుస్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దీనికి ఆనం ఏ బదులు ఇస్తారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇక రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్యేలను గతంలో కొనుగోలు చేసిన టీడీపీ, ఇప్పుడు వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యేలను తీసుకుంటోందని, అయితే అలా చేయడం వలన వైసీపీకి ఏమీ నష్టం లేదని అన్నారు. మంత్రి పదవి ఇవ్వ లేదని టిడిపిలోకి వెళ్లే ఆనంకు ఆ పార్టీలో మంత్రి పదవి ఇస్తారా ? అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అని రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2024లో మరలా అధికారంలోకి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు.
తాజావార్తలు
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!