Nedurumalli Ramkumar Reddy: బ్రష్టుపట్టించాలనే ఇలా చేశారు..’ఆనం’పై నేదురుమల్లి విమర్శల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nedurumalli Ramkumar Reddy Slams Anam Ramanarayana Reddy: అనేక ప్రచారాల అనంతరం తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా ప్రకటించారు. వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరే అవకాశం ఉందని రామనారాయణ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. నిజానికి ఆయన ముందు నుంచి పార్టీకి దూరం అవుతారనే సూచనలతో వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు తాజాగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయం మొదటి నుంచి ఊహించిందేనని అన్నారు.
Also Read
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
మంత్రి పదవి రాలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారని, గడచిన నాలుగు సంవత్సరాలలో వెంకటగిరిని కలుషితం చేశారని అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాలు చేశాడని పేర్కొన్న ఆయన మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూశాడని ఆరోపించారు. వైసీపీని బ్రష్టుపట్టించాలనే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశాడని, నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ ఆపాడని అన్నారు. ఆనం విషయం తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పెట్టారని, వెంకటగిరి మున్సిపాలిటీలోని జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలు బయటపెడతానని ఆయన హెచ్చరించారు. రాజకీయ చరిత్ర అని చెప్పుకునే ఆనం కుటుంబం ఎంత మందిని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసింది? అని ప్రశ్నించారు.
Also Read: YV Subba Reddy: టీడీపీ ట్రాప్లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి కౌంటర్
ఇక నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి పై జరిగిన దాడి హేయమైన చర్యేనని పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఘటనను ఆ రోజు ఆనం రామనారాయణరెడ్డి బ్లాక్ డే అన్నారు, కానీ అదే ఆనం వెంకటరమణారెడ్డిపై గతంలో ఆనం రామనారాయణరెడ్డి కర్ర తీసుకుని వెళ్లారు, ఆ ఘటనపై పోలీసుస్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దీనికి ఆనం ఏ బదులు ఇస్తారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇక రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్యేలను గతంలో కొనుగోలు చేసిన టీడీపీ, ఇప్పుడు వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యేలను తీసుకుంటోందని, అయితే అలా చేయడం వలన వైసీపీకి ఏమీ నష్టం లేదని అన్నారు. మంత్రి పదవి ఇవ్వ లేదని టిడిపిలోకి వెళ్లే ఆనంకు ఆ పార్టీలో మంత్రి పదవి ఇస్తారా ? అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అని రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2024లో మరలా అధికారంలోకి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు.
తాజావార్తలు
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?