Andhra Pradesh: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో జమ కానున్న రూ.4వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: నేడు ఏపీలోని రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కానున్నాయి. ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయం, నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. నేడు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. వచ్చే సంక్రాంతి రోజుల్లో ప్రతి రైతన్నకూ మూడో విడతగా మరో రూ.2 వేలను ప్రభుత్వం అందించనుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ.13,500 రైతు భరోసా సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా 50 లక్షలకు పైగా రైతన్నలకు ప్రతి ఏటా సుమారు రూ.7వేల కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ళ నాలుగు నెలల్లో జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 25,971.33 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తోంది. విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వర్గాల వారీగా వైఎస్సార్ రైతు భరోసా సాయం:
బీసీలు: 24,61,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 12,113.11 కోట్లు
ఎస్సీలు: 5,23,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 2,653.04 కోట్లు
ఎస్టీలు: 3,92,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 1,771.13 కోట్లు
మైనార్టీలు: 60,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 320.68 కోట్లు
కాపులు: 7,85,700 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 3,793.44 కోట్లు
ఇతరులు: 10,16,300 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 5,319.93 కోట్లు
మొత్తం: 52,38,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 25,971.33 కోట్లు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!