Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysr Rythu Bharosa And Pm Kisan Funds Will Released By Cm Jagan Today In Nandyal District

Andhra Pradesh: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో జమ కానున్న రూ.4వేలు

Published Date :October 17, 2022 , 7:36 am
By Ramesh Nalam
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో జమ కానున్న రూ.4వేలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh: నేడు ఏపీలోని రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కానున్నాయి. ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయం, నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. నేడు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నారు. వచ్చే సంక్రాంతి రోజుల్లో ప్రతి రైతన్నకూ మూడో విడతగా మరో రూ.2 వేలను ప్రభుత్వం అందించనుంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ.13,500 రైతు భరోసా సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా 50 లక్షలకు పైగా రైతన్నలకు ప్రతి ఏటా సుమారు రూ.7వేల కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ళ నాలుగు నెలల్లో జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 25,971.33 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read

  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!

రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్‌ రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తోంది. విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

వర్గాల వారీగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయం:
బీసీలు: 24,61,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 12,113.11 కోట్లు
ఎస్సీలు: 5,23,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 2,653.04 కోట్లు
ఎస్టీలు: 3,92,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 1,771.13 కోట్లు
మైనార్టీలు: 60,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 320.68 కోట్లు
కాపులు: 7,85,700 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 3,793.44 కోట్లు
ఇతరులు: 10,16,300 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 5,319.93 కోట్లు
మొత్తం: 52,38,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 25,971.33 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM Jagan Mohan Reddy
  • Farmers
  • pm kisan
  • ysr rythu bharosa

తాజావార్తలు

  • PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!

  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions