YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు.. ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోంది..!
- రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు..
- వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు.. గ్రేడ్ బాగున్నా రూ. 600 మాత్రమే క్వింటా అమ్ముతున్నారు… రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డ ఆయన.. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి.. కానీ, ఈ ప్రభుత్వానికి కమిషన్ రాదని బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు..
Read Also: YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం
Also Read
ఇక, ఏ పంట వేసుకున్న రైతుకు గిట్టుబాటు ధర లేదన్నారు వైఎస్ జగన్.. అన్నదాత సుఖీభవకు రూ.20,000… రూ. 20,000.. రూ. 40,000 ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.. ప్రభుత్వమే రైతులు వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.. కానీ, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్.. మరోవైపు, జగన్ రాక సందర్భంగా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లిలో వైసీపీ కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు.. జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు గ్రామస్తులు.. మొన్నటి ఉప ఎన్నికల్లో మా ఓటు వేసుకోకుండా అడ్డుకున్నారని ప్ల కార్డులు ప్రదర్శించారు మహిళలు.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయనిలోని వైఎస్సార్ ఘాట్లో నివాళులర్పించి.. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ఆ తర్వాత వైఎస్సార్ ఘాట్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు జగన్.. దారి పొడువునా జన నీరాజనం పట్టారు.. తాళ్లపల్లె వద్ద చీనీ, ఉల్లి రైతులతో మాట్లాడిన జగన్.. గత ప్రభుత్వ హయాంలో చీనీ రైతులను ఆదుకున్నామన్న తెలిపారు..
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!