TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
- అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు..
- టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు..
- కడపలో మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్న చంద్రబాబు..
- సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్ షేరింగ్ సాధించామన్న సీఎం ..
- 3 విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం..
- ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం..
- ప్రతినిధుల సభలో 6 శాసనాలు ప్రతిపాదించిన నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. 3 రోజులపాటు జరగనున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. సభా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంతాపం తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసమే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్ షేరింగ్ సాధించినట్లు సీఎం వివరించారు. కార్యకర్తల పట్టుదల, శ్రమ వల్లే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది.
Read Also: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
Also Read
43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే 6 వేలతో కలుపుకొని మూడు విడతల్లో 20 వేలు చెల్లిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..
Read Also: Pakistan: ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ప్లేస్కి ఎగబాకిన పాక్ ప్లేయర్
పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు నారా లోకేశ్. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అనే ఆరు శాసనాలను సభ ముందుంచారు లోకేష్. వెనుకబడిన కార్యకర్తల ఆర్థిక స్థితి గతులను మార్చడానికి ఇక నుంచి పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉరసా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధమని లోకేశ్ సవాల్ చేశారు. ఇవాళ, రేపు కూడా మహానాడులో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. మహానాడు ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చినవారికి 30 రకాల వంటకాలతో పసందైన భోజనం వడ్డించారు. ఈ నెల 29న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!