MLC Lella AppiReddy: దొంగ ఓట్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు..
- ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
- పోలింగ్ అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కి 35 ఫిర్యాదులు చేశాం..
- దొంగ ఓట్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు: లేళ్ల అప్పిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Lella AppiReddy: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, వ్యవస్థలను పతనం చేసి గెలిచారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఓటింగ్ కు ముందు పోలింగ్ కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళానికి గురి చేశారని పేర్కొన్నారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.. వైసీపీకి కేవలం 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కి 35 ఫిర్యాదులు చేశాం.. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం.. అయినా కూడా ఎన్నికల కమీషన్ ఎందుకు పట్టించుకోలేదు? అని క్వశ్చన్ చేశారు. హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చా, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది అని లేళ్ల అప్పిరెడ్డి గుర్తు చేశారు.
Also Read
ఇక, ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైసీపి అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే, ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు అన్నారు. జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు.. ఎన్నికల కమీషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది.. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని లేళ్ల అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!