MLA vs Mayor: కడప కార్పొరేషన్ సమావేశంలో మళ్లీ రచ్చ.. ఎమ్మెల్యే మాధవి సంచలన వ్యాఖ్యలు
- కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత..
- మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళన..
- టీడీపీ సభ్యుల ఆందోళనల.. సమావేశాన్ని బాయికాట్ చేసిన వైసీపీ సభ్యులు..
- మేయర్, వైసీపీ సభ్యులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA vs Mayor: కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు.. సమావేశం నుంచి మేయర్ సురేష్ బాబు బయటకు వెళ్లిపోయారు.. సమావేశంలో ఉదయం నుంచి సీటు ఫైట్ కొనసాగింది.. మేయర్ సీటు పక్కనే తనకు కూడా సీటు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే మాధవి డిమాండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల ఘర్షణతో కార్పొరేషన్లో ఆందరగోళ పరిస్థితి నెలకొంది.. మధ్యాహ్నం తర్వత కూడా సమావేశంలో కుర్చీ ఫైట్ కొనసాగడంతో.. వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు..
Read Also: Minister Thummala: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు
Also Read
ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.. కడప కార్పొరేషన్ సమావేశం ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆమె.. అజెండాపై చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారని దుయ్యబట్టారు.. ఇలాంటి సమావేశానికి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మేయర్ కు లేదన్నారు.. ఒక నియంతలా వ్యవహరించారు.. ఒక మహిళ ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు. కడప కార్పొరేషన్ రాయించుకున్నట్ల వ్యవహారించారు. వైసీపీ అచ్చోసిన ఆంబోతులా మేయర్ను వదిలేసిందని ఫైర్ అయ్యారు. సమావేశంలో వైకాపా కార్పోరేటర్లు హంగామా చేశారు. రోడ్ల విస్తరణలో గుడి తొలిగించి తర్వాత నిర్మించలేదు. గుడి, మసీదు,చర్చి స్థలాలు ఆక్రమించారు. కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారని.. ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. అనధికారికంగా మేయర్ కార్పొరేషన్ రాయించుకున్నారు. కనీసం వీధి కుక్కలను అరికట్టలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందన్నారు.. సమాధానం చెప్పలేక చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారు. ప్రజా సమస్యలు మేయర్ కు పట్టవు.. మేయర్ కుటుంబ సభ్యులు నిబంధనలు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి..
తాజావార్తలు
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!