MLA vs Mayor: కడప కార్పొరేషన్ సమావేశంలో మళ్లీ రచ్చ.. ఎమ్మెల్యే మాధవి సంచలన వ్యాఖ్యలు
- కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత..
- మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళన..
- టీడీపీ సభ్యుల ఆందోళనల.. సమావేశాన్ని బాయికాట్ చేసిన వైసీపీ సభ్యులు..
- మేయర్, వైసీపీ సభ్యులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA vs Mayor: కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు.. సమావేశం నుంచి మేయర్ సురేష్ బాబు బయటకు వెళ్లిపోయారు.. సమావేశంలో ఉదయం నుంచి సీటు ఫైట్ కొనసాగింది.. మేయర్ సీటు పక్కనే తనకు కూడా సీటు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే మాధవి డిమాండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల ఘర్షణతో కార్పొరేషన్లో ఆందరగోళ పరిస్థితి నెలకొంది.. మధ్యాహ్నం తర్వత కూడా సమావేశంలో కుర్చీ ఫైట్ కొనసాగడంతో.. వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు..
Read Also: Minister Thummala: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు
Also Read
ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.. కడప కార్పొరేషన్ సమావేశం ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆమె.. అజెండాపై చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారని దుయ్యబట్టారు.. ఇలాంటి సమావేశానికి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మేయర్ కు లేదన్నారు.. ఒక నియంతలా వ్యవహరించారు.. ఒక మహిళ ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు. కడప కార్పొరేషన్ రాయించుకున్నట్ల వ్యవహారించారు. వైసీపీ అచ్చోసిన ఆంబోతులా మేయర్ను వదిలేసిందని ఫైర్ అయ్యారు. సమావేశంలో వైకాపా కార్పోరేటర్లు హంగామా చేశారు. రోడ్ల విస్తరణలో గుడి తొలిగించి తర్వాత నిర్మించలేదు. గుడి, మసీదు,చర్చి స్థలాలు ఆక్రమించారు. కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారని.. ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. అనధికారికంగా మేయర్ కార్పొరేషన్ రాయించుకున్నారు. కనీసం వీధి కుక్కలను అరికట్టలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందన్నారు.. సమాధానం చెప్పలేక చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారు. ప్రజా సమస్యలు మేయర్ కు పట్టవు.. మేయర్ కుటుంబ సభ్యులు నిబంధనలు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి..
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!