YS Jagan: ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను ప్రవేశ పెట్టారు..
- పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు..
- ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారు..
- ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను ప్రవేశపెట్టారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడిపారు.. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు.. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు తెలుస్తాయని ఈ సాగతీత చేశారు.. ఈ విషయం తెలిసే బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో సాగదీశారు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేసి బడ్జెట్ ఆలస్యానికి కారణమైందన్నారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయి.. ఆర్గనైజ్డ్ క్రైం చంద్రబాబు ఎలా చేస్తారో బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
అలాగే, చంద్రబాబు ఇంతకాలం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా సాగదీశారని మాజీ సీఎం జగన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటపడతాయని భయపడ్డారు.. ఇక, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు నిలదీస్తారని భయపడ్డారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు.. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్ లో తెలిసిపోయింది.. పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేశారు.. ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. కానీ, చంద్రబాబు, జగన్ ముఖాన్ని ఏ బ్యాంకులు రుణాలు ఇవ్వవు అని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఇక, పురంధరేశ్వరి బీజేపీలో టీడీపీ నాయకురాలు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయానికి అప్పులు 14 లక్షల కోట్ల వరకు వెల్లినట్టు తప్పుడు ప్రచారం చేశారు.. పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్ తెరమరుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకోసం ఈ అబద్ధాలు చెబుతూ జగన్ పై ఆ నెపం నెడుతున్నారు.. బాధగా ఉంది ఆవేదనగా ఉందని చంద్రబాబు చేస్తున్న యాక్షన్ దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ నటనకు మించి ఉంది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నథింగ్ అని పేర్కొన్నారు. 2018లో చంద్రబాబు దిగిపోయే నాటికి 3 లక్షల 13 వేల కోట్ల అప్పు ఉంది.. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పు 6 లక్షల 46 వేల కోట్లు ఉందన్నారు. అబద్దాలు చెప్పడం.. ఢిల్లీకి వెళ్లడం.. ఏజెన్సీలకు ఫిర్యాదు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!