YS Jagan: ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను ప్రవేశ పెట్టారు..
- పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు..
- ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారు..
- ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను ప్రవేశపెట్టారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడిపారు.. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు.. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు తెలుస్తాయని ఈ సాగతీత చేశారు.. ఈ విషయం తెలిసే బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో సాగదీశారు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేసి బడ్జెట్ ఆలస్యానికి కారణమైందన్నారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయి.. ఆర్గనైజ్డ్ క్రైం చంద్రబాబు ఎలా చేస్తారో బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
Also Read
అలాగే, చంద్రబాబు ఇంతకాలం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా సాగదీశారని మాజీ సీఎం జగన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటపడతాయని భయపడ్డారు.. ఇక, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు నిలదీస్తారని భయపడ్డారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు.. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్ లో తెలిసిపోయింది.. పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేశారు.. ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. కానీ, చంద్రబాబు, జగన్ ముఖాన్ని ఏ బ్యాంకులు రుణాలు ఇవ్వవు అని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఇక, పురంధరేశ్వరి బీజేపీలో టీడీపీ నాయకురాలు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయానికి అప్పులు 14 లక్షల కోట్ల వరకు వెల్లినట్టు తప్పుడు ప్రచారం చేశారు.. పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్ తెరమరుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకోసం ఈ అబద్ధాలు చెబుతూ జగన్ పై ఆ నెపం నెడుతున్నారు.. బాధగా ఉంది ఆవేదనగా ఉందని చంద్రబాబు చేస్తున్న యాక్షన్ దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ నటనకు మించి ఉంది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నథింగ్ అని పేర్కొన్నారు. 2018లో చంద్రబాబు దిగిపోయే నాటికి 3 లక్షల 13 వేల కోట్ల అప్పు ఉంది.. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పు 6 లక్షల 46 వేల కోట్లు ఉందన్నారు. అబద్దాలు చెప్పడం.. ఢిల్లీకి వెళ్లడం.. ఏజెన్సీలకు ఫిర్యాదు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?