YS Jagan Mohan Reddy: తన కాన్వాయ్ ఆపి.. ఆంబులెన్స్కి దారిచ్చిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy Gives Way For Ambulance By Stopping His Convoy: మదెనపల్లిలోని విద్యాదీవెన కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తుండగా.. 108 అంబులెన్స్కు దారిచ్చారు. అక్కడి నుంచి ఆంబులెన్స్ వెళ్లేంతవరకూ.. తన కాన్వాయ్ను పక్కన ఆపారు. ఆంబులెన్స్ వెళ్లాక, ఆయన కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం సీఎం జగన్ విద్యాదీవెన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఏపీ సీఎంఓ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మరోవైపు.. విద్యాదీవెన పథకం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి, నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో.. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువేని, కుటుంబాల తలరాత మారాలన్నా, పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గమని అన్నారు.
Also Read
- Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
చదువులకు పేదరికం అవరోధం కావొద్దన్న ఉద్దేశంతోనే దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని.. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయని జగన్ అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూసి.. అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు చదువును హక్కుగా మార్చామన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించి, జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామని పేర్కొన్నారు.
విద్యాదీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లెలో హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు వెళ్తుండగా, 108 అంబులెన్స్కు దారిచ్చిన ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న బస్సు. pic.twitter.com/9DRcO5PTbb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 30, 2022
తాజావార్తలు
-
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?