Vellampalli Srinivas: ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు..?
- జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం పుస్తకం ఆవిష్కరణ..
- కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా తప్పుడు వాగ్దానాలపై పుస్తకం..
- ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vellampalli Srinivas: జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. కూటమి సర్కార్ కేవలం వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టడం, వైసీపీ కార్యకర్తలని అరెస్టు చేసే పనిలోనే బిజీగా ఉన్నారని వెల్లంపల్లి అన్నారు.
Read Also: Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ఇక, కూటమి ప్రభుత్వాన్ని దేని గురించి అయినా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇక, తల్లికి వందనం అనే పేరుతో రూ. 13 వేల రూపాయలు వేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎంతమంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు అదే ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు.. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు.. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోయిందని తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు.. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు ఎంత అప్పు చేసాడో ప్రజలు చెప్పాలి వెల్లంపల్లి శ్రీనివాస్ అడిగారు.
Read Also: The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
అయితే, 40 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉందని చెప్పుకొని తిరిగే చంద్రబాబు, దేశంలో మోడీ కంట నేనే సీనియర్ అని చెప్పుకునే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అని వైసీపీ నేత వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు అంటే పథకాలు అమలు చేయని వ్యక్తి.. ప్రజలు ఎవరికీ పథకాలు కూడా పథకాలు రావు.. ఎంతసేపు రెడ్ బుక్ అని భయపెట్టేలని తిరుగుతున్నారు.. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చేరి విధంగా కృషి చేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!