ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
Also Read: IND vs SA: పసలేని బ్యాటింగ్.. వైట్వాష్ దిశగా భారత్! కుల్దీప్లా ఆడుంటే
బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని.. అరటి తోటలను పరిశీలించి అక్కడే రైతులతో మాట్లాడతారు. అనంతరం పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బెంగుళూరుకు జగన్ తిరుగు పయనమవుతారు.