YCP Social Media: సోషల్ మీడియాపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. నియోజకవర్గాల వారీగా టీమ్లు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ సోషల్ మీడియా వింగ్పై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సామాజికి మాధ్యమాల సామూహాన్ని పటిష్టం చేశారు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్కు అప్పగించిన విషయం తెలిసిందే.. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ రాగా.. ఈ మధ్యే.. సజ్జల భార్గవ్కు సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతల్ని పర్యవేక్షించడానికి ఐ అండ్ పిఆర్కు అనుబంధంగా మొదట్లో డిజిటల్ డైరెక్టర్ను నియమించారు. ఆ తర్వాత దానిని ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో విపక్షాల నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా.. ఓ టీమ్ను తయారు చేసుకున్నారు..
Read Also: Central Funds: ఏపీ, యూపీ సహా ఈ రాష్ట్రాలకు కేంద్రం గుడ్న్యూస్..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
అయితే, ఇది కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జిల్లాస్థాయిలో.. చివరకు నియోజకవర్గాల స్థాయిలోనే విస్తరించేందుకు ప్లాన్ చేసిన వైసీపీ.. అందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు నుంచి ఆరుగురిని సోషల్ మీడియా వింగ్ కింద నియమించింది.. అంటే, కేవలం రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తే సరిపోదని.. నియోజవర్గాల వారీగా టీమ్లు ఉంటే.. అక్కడ పార్టీ, ప్రభుత్వ ప్రచారంతో పాటు.. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలకు వెంటనే కౌంటర్ ఇవ్వాలనే ప్లాన్లో భాగంగా.. వైసీపీ నియోజకవర్గాల వారీగా టీమ్లను నియమించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది.. బీజేపీ కూడా పరవాలేదు.. ఇప్పుడు అధికార వైసీపీ.. వారందరికీ కౌంటర్ ఇచ్చేలా స్పెషల్ వింగ్తో రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!