చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు.
Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్
Also Read
ఇప్పటికైనా చంద్రబాబు లాంటి మోసగాడిని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టాలని లక్ష్మీపార్వతి హితవు పలికారు. ఆనాడు తనకు కావాల్సినంత డబ్బు ఇస్తానని, విదేశాలకు వెళ్లిపోవాలని చంద్రబాబు తనను కోరాడని.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నాడని.. ఆయన మాటలను నమ్మవద్దని కోరారు. చంద్రబాబుపై పోరాటం చేసేందుకే తాను వైసీపీలో చేరారని.. తన సిద్ధాంతం, జగన్ సిద్ధాంతం ఒక్కటేనన్నారు. విజయమ్మ, షర్మిలపై టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విషయం మీకు తెలియదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెప్పించుకుని నందమూరి ఫ్యామిలీ అసలు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పురంధేశ్వరికి చంద్రబాబు నిజస్వరూపం తెలియదా అని నిలదీశారు.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..