చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు.
Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్
Also Read
ఇప్పటికైనా చంద్రబాబు లాంటి మోసగాడిని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టాలని లక్ష్మీపార్వతి హితవు పలికారు. ఆనాడు తనకు కావాల్సినంత డబ్బు ఇస్తానని, విదేశాలకు వెళ్లిపోవాలని చంద్రబాబు తనను కోరాడని.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నాడని.. ఆయన మాటలను నమ్మవద్దని కోరారు. చంద్రబాబుపై పోరాటం చేసేందుకే తాను వైసీపీలో చేరారని.. తన సిద్ధాంతం, జగన్ సిద్ధాంతం ఒక్కటేనన్నారు. విజయమ్మ, షర్మిలపై టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విషయం మీకు తెలియదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెప్పించుకుని నందమూరి ఫ్యామిలీ అసలు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పురంధేశ్వరికి చంద్రబాబు నిజస్వరూపం తెలియదా అని నిలదీశారు.
తాజావార్తలు
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?