Y Satya Kumar: పోలవరంని అందరూ ఏటీఎంలా చూశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ స్పందించారు. ఆ ప్రాజెక్ట్ను ప్రతిఒక్కరూ ఏటీఎంలానే చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు వస్తున్నారు, పోతున్నారే తప్ప.. ఫోలవరంపై ఫోకస్ పెట్టడం లేదని ఆరోపించారు. పోలవరం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఏమీ తేల్చడం లేదని దుయ్యబట్టారు. పని పూర్తి చేస్తే కేంద్రం నిధులిస్తుందని, కానీ ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహించారు.
ఏపీలో చెత్త తొలగించాలన్నా.. చిన్న చిన్న రిపేర్లు చేయాలన్నా కేంద్రం ఇస్తోన్న నిధులే దిక్కయ్యాయని సత్య కుమార్ చెప్పారు. దేశంలో గత 8 ఏళ్లలో మునుపెన్నడూ జరగని విశేష అభివృద్ధి జరిగిందన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్రం మింగేస్తోందని విమర్శించారు. ఏపీలో కూల్చివేతలతో మొదలైన పరిపాలన ఇంకా కొనసాగుతూనే ఉందని అభిప్రాయపడ్డారు. ఇసుక నుంచి తైలం తీయొచ్చన్న సత్య కుమార్.. ఇసుకని సైతం అధికార పార్టీ ఆదాయ మార్గంగా మలుచుకుందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఏం సాధించారని ప్రశ్నించిన ఆయన.. మూడు రాజధానులని చెప్పి, రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని ఆగ్రహించారు.
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ఇదే సమయంలో.. ఏయూలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చిన విషయంపై సత్య కుమార్ స్పందించారు. అసాంఘీక కార్యక్రమాలను బూచిగా చూపి.. భూముల్ని దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఏయూ భూములను వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలా జరగనివ్వమని సత్య కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!