Extramarital Affair: వివాహేతర సంబంధం.. సినిమాని మించిన త్రిల్లర్ క్రైమ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband For Extramarital Affair: వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ అత్యంత కిరాతకానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసుందామనుకొని, అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై తన భర్త మరో మహిళతో పారిపోయాడని కట్టుకథ అల్లింది. కేసుని తప్పుదోవ పట్టించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరికి.. పోలీసులకు అడ్డంగా బుక్కైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని వలందపేటలో పోలమ్మ అనే మహిళ తన ఐదురు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి ఉంటోంది. పోలమ్మకు రెండస్తుల ఇల్లు ఉంది. తన మూడో కుమారుడైన పైడిరాజుకి జ్యోతి అనే మహిళతో పెళ్లి చేసింది. వీళ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
కట్ చేస్తే.. జ్యోతికి విశాఖ అప్పుఘర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉంది. తనకు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఉద్యోగం వచ్చిందని నమ్మించి, అక్కడ అద్దె ఇల్లు తీసుకొని, నూకరాజుతో రాసలీలలు కొనసాగించింది. ప్రియుడి మోజులో మునిగిన జ్యోతి.. అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. అందుకు అడ్డుగా ఉన్న తన భర్తని హతమార్చాలని నిర్ణయించింది. ప్లాన్ ప్రకారం.. డిసెంబర్ 29న రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పైడిరాజుకి పెట్టింది. అది తిన్న తర్వాత స్పృహ తప్పిన పైడిరాజు తలపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో, అతడు మరణించాడు. ఆ మృతదేహాన్ని డిసెంబర్ 30న ప్రియుడు శ్రీనివాసరావు, అతని కజిన్ భూలోక సాయంతో శ్మశానవాటికలో దహనం చేసింది. అదే రోజు రాత్రి తన భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో తన భర్త వెళ్లిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే.. దివ్య అనే మహిళతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి, తన కోసం వెతకొద్దని చెప్పించింది కూడా!
Babar Azam: బాబర్ ఆజంపై కొరడా.. కెప్టెన్సీ నుంచి తొలగింపు?
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా.. పోలీసులకు జ్యోతిపై అనుమానం వచ్చింది. కేవలం 8వ తరగతి చదువుకున్న ఆమెకి, సీబీఐ ఆఫీస్లో ఉద్యోగం ఎలా వచ్చిందనే సందేహం కలిగింది. వాళ్లు కార్యాలయానికి వెళ్లి విచారించగా, జ్యోతి తమ వద్ద పని చేయట్లేదని చెప్పారు. దీంతో.. జ్యోతిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. తనకు శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉందని, అతనితో కలిసి జీవించడం కోసమే తాను తన భర్తను హతమార్చానని జ్యోతి నేరం ఒప్పుకుంది. పైడిరాజు హత్యకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!