Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం వెనుక సముద్ర గర్భంలో ఏదైనా అసాధారణ చర్య సంభవించిందా…? అనే అనుమానం తలెత్తింది. సాధారణంగా ఇలా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి మధ్య నల్లగా మారే స్పాట్లు చాలానే ఉన్నాయి. సీజన్ మారినప్పుడు, సుముద్రంలో బలమైన అలజడి చోటు చేసుకునే సందర్భంలోనూ ఇది తరచూ జరిగే పరిణామామే. ఐతే, అందోళన కలిగించే స్థాయిలో బ్లాక్ శాండ్ డిపాజిట్ అవ్వడం వెనుక కారణాలను ఆంధ్రా యూనివర్శిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం ప్రాథమికంగా విశ్లేషించింది.
Read Also: Munugode bypoll: మునుగోడు సభపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
సముద్ర వాతావరణంలో సంభవించే మార్పులు అంటే అలల ఉధృతి పెరగడం మొదటికారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వలన తీరం వద్ద లోతు ఎక్కువగా ఉన్న చోట్ల కోతకు గురవుతుంది. అలాగే డ్రెడ్జింగ్ కారణంగాను ఇసుక కోతకు గురవుతూనే ఉంటుంది. ఇది తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా కోతకు గురయ్యే సమయంలో స్పెసిఫిక్ గ్రాఫిటీ ఎక్కువగా ఉన్న ఇసుక ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో ఆ ప్రాంతంలో ఇసుక నల్లగా కనపడుతుంది. వాతావరణంలో హై ఎనర్జీ అంటే అలల ఉధృతి ఎక్కువగా ఉండటం, తీరం వద్ద గాలులు ఉండటం, అటుపోట్లు అధికంగా ఉన్నప్పుడు హైలెవెన్ మినరల్స్ తీరానికి కొట్టుకుని వస్తాయి. ఇవి అక్కడున్న ఇసుకతో చర్య పొందడం వలన ఆ ఇసుక నల్లగా మారతుంది.ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియలో భాగమేనని ఈ సారి అధిక మొత్తంలో నల్లటి ఇసుక డిపాజిట్ కావడంతో ఆందోళన నెలకొంది తప్ప భయపడాల్సినది ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
తీరంలో బ్లాక్ శాండ్ డిపాజిట్ కు మరో కారణం భార లోహాలు. తూర్పుకనుమలు ఖనిజ నిక్షేపాల కు నిలయం. ఇక్కడ కొండల మీదుగా వచ్చే ప్రవాహాలు వాటితో పాటు హెవీ మినరల్స్ ను మోసుకుని వస్తాయి. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు ఉన్నా, ఏవైనా ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక ఆయా రంగులను సంతరించుకుంటుంది. శ్రీకాకుళంజిల్లా బారువ తీరంలో ఇసుక ఎప్పుడు నల్లగానే ఉండటం ఒక ఉదాహారణ. తీర ప్రాంతంలోనైతే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఐరన్ ఓర్ తీరంలో ఉండే ఇసుకలోని సిలికాతో చర్య పొంది ఆ ఇసుకకు నల్లని రంగుని ఇస్తుంది. ఇక, ఇల్మనైట్, మోనోజైట్, హెమటైట్ వంటి ఖనిజాలు కూడా ఇదే లక్షణాలు కలిగి ఉంటాయి. ఉత్తరాంధ్ర తీరంలో భార లోహాలు ఉన్నాయనేది పరిశోధనలు నిర్ధారించాయి. బీచ్ మినరల్స్ తవ్వేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు విశాఖ తీరం లో వచ్చి చేరినవి హెవీ మినరల్స్ కాగా ఇవి ఎక్కువ రోజులు కనిపించవు. అలల ఉధృతికి తిరిగి సముద్రంలో కలిసిపోతాయి. ఐతే, ఇంత పెద్ద ఎత్తున మినరల్స్ డిపాజిట్ రావడం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!