VRO Accident: పెదపట్నంలంకలో వీఆర్వోకి తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా వుంది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో మహిళా వీఆర్ వో కి (VRO) ప్రమాదం తప్పింది. వరద సాయం అందించేందుకు వెళుతున్న వీఆర్వో గొల్లం మందల లక్ష్మీ కుమారికి ప్రమాదం తప్పింది. మామిడికుదురు మండలం పెదపట్ల లంకలో రెవిన్యూ అండ్ పంచాయతీ సిబ్బంది ప్రయాణిస్తున్న ఈ పడవ అదుపు తప్పింది. వరద బాధితులను తరలించేందుకు నాటు పడవ ఎక్కారు వీ ఆర్ వో. వరద నీరు వడిగా ప్రవహించడంతో తిరగబడి పోయింది పడవ. పడవ తిరగబడడంతో వరద నీటిలో మునిగి పోతున్న మహిళా వీఆర్వోని హుటాహుటిన రక్షించారు స్థానికులు.
మరోవైపు గోదావరి భారీ వరదల్లో (Godavari Heavy floods)కొట్టుకు వస్తున్న భయంకరమైన విష సర్పాలతో (Snakes) జనం హడలిపోతున్నారు. ఏ సర్పం ఎక్కడినించి బయటకు వస్తుందో తెలీక వరద నీటిలో బిక్కుబిక్కుమంటున్నారు జనం. మామిడికుదురు మండలం, బి.దొడ్డవరం లో వరదలకు కొట్టుకు వచ్చి గోడపైకి ఎక్కిన పాములను చూసి హడలిపోతున్న స్థానికులు ఈ క్షణాన ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా వుంటే.. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో రోడ్డు కం రైలు బ్రిడ్జి పై నుండి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. రాజమండ్రి-కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై భారీ వాహనాలకి అనుమతి నిరాకరించి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం బైక్ లు, ఆటోలు , కార్లకి మాత్రమే బ్రిడ్జి పైకి అనుమతి ఇస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలు నిషేధం అమలు చేయడంతో బ్రిడ్జికి ఇరువైపుల పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.
Also Read
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!

గోదావరి వరదలు రైతాంగాన్ని నిండా ముంచేశాయి. చేతికందిన పంట నీట మునగడంతో రైతన్నల కళ్లలో కన్నీళ్ల గోదారి పారుతోంది. పంటలు, కూరగాయలు తోటలు, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి అపార్ట్ నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటి పాలైందని కోనసీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతాంగం నష్టాలతో కష్టాలు పాలయ్యారు. పచ్చని కోనసీమ వరదలతో అల్లాడుతుంది. ఎటుచూసినా జలమయం.. మూగజీవాల ఇబ్బందులు వర్ణనాతీతం. పిల్లా పాపలతో పెద్దలు ఊళ్లు దాటుతున్నారు. పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ తల దాచుకుంటున్నారు. కోనసీమలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులు నీట మునిగాయి. ప్రజలు బయటకు రావాలన్నా, తిరిగి లోపలికి వెళ్ళాలన్నా భయాందోళనలకు గురౌతున్నారు. గోదావరి లంకలకు ముప్పు వాటిల్లడంతో నీట మునిగిన రహదారుల్లోనే మోకాళ్ల లోతు నీటిలో నడక సాగిస్తున్నారు. ఇళ్లు చుట్టూ నీరు ఆవరించడంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో ప్రజలు పడుతున్న వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
తాజావార్తలు
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!