Farmers Protest: విజయనగరంలో ఉద్రిక్తత.. యూరియాకు రాజకీయ నాయకుల సిఫార్సు.. రైతుల మధ్య గొడవ!
- విజయనగరం: గజపతినగరం పీఎసీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
- రాజకీయ నాయకుల సిఫార్సులతో రైతుల మధ్య గొడవ..
- రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికే యూరియా అందిస్తున్న అధికారులు..
- కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు..
- అధికారుల తీరుకు నిరసనగా కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేశారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తుంది. గజపతినగరం పీఏసీఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడిన గందరగోళం.. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతన్నలు రోడ్లపై బైఠాయించారు.
Read Also: Kids Mobile Usage : పిల్లలతో మొబైల్ వాడకం తగ్గించే.. 7 సింపుల్ టిప్స్
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
రైతుల ఆందోళన
అయితే, విజయనగం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సమస్య రైతులను ఆందోళనకు గురు చేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరికి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం పీఏసీఎస్ కి యూరియా వస్తుందన సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇక, కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిల్చొని గంటల తరబడి వేచి చూశారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని భావించిన రాజకీయ నాయకులు అక్కడికి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాకత్ అయ్యి కొందరికే యూరియా ఇచ్చినట్టు రైతులు ఆరోపణలు చేయడంతో.. ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం..
ఇక, పీఏసీఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే, ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, రైతులు రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లతో రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో నగరంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: IOB SO Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
యూరియా సరఫరాలో పారదర్శకత
రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని.. ప్రతి రైతుకి పాస్బుక్ ఆధారంగా సముచితంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తక్షణమే ఎక్కువ స్టాక్ అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. పంటలు కీలక దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. ఇది ఆర్థికంగా రైతును దెబ్బతీసే కుట్ర మాత్రమే కాదు, భవిష్యత్ పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఇక, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే, యూరియా సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!