Farmers Protest: విజయనగరంలో ఉద్రిక్తత.. యూరియాకు రాజకీయ నాయకుల సిఫార్సు.. రైతుల మధ్య గొడవ!
- విజయనగరం: గజపతినగరం పీఎసీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
- రాజకీయ నాయకుల సిఫార్సులతో రైతుల మధ్య గొడవ..
- రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికే యూరియా అందిస్తున్న అధికారులు..
- కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు..
- అధికారుల తీరుకు నిరసనగా కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రైతులు..
Farmers Protest: విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేశారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తుంది. గజపతినగరం పీఏసీఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడిన గందరగోళం.. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతన్నలు రోడ్లపై బైఠాయించారు.
Read Also: Kids Mobile Usage : పిల్లలతో మొబైల్ వాడకం తగ్గించే.. 7 సింపుల్ టిప్స్
Also Read
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
- Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
రైతుల ఆందోళన
అయితే, విజయనగం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సమస్య రైతులను ఆందోళనకు గురు చేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరికి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం పీఏసీఎస్ కి యూరియా వస్తుందన సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇక, కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిల్చొని గంటల తరబడి వేచి చూశారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని భావించిన రాజకీయ నాయకులు అక్కడికి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాకత్ అయ్యి కొందరికే యూరియా ఇచ్చినట్టు రైతులు ఆరోపణలు చేయడంతో.. ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం..
ఇక, పీఏసీఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే, ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, రైతులు రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లతో రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో నగరంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: IOB SO Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
యూరియా సరఫరాలో పారదర్శకత
రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని.. ప్రతి రైతుకి పాస్బుక్ ఆధారంగా సముచితంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తక్షణమే ఎక్కువ స్టాక్ అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. పంటలు కీలక దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. ఇది ఆర్థికంగా రైతును దెబ్బతీసే కుట్ర మాత్రమే కాదు, భవిష్యత్ పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఇక, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే, యూరియా సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!