Farmers Protest: విజయనగరంలో ఉద్రిక్తత.. యూరియాకు రాజకీయ నాయకుల సిఫార్సు.. రైతుల మధ్య గొడవ!
- విజయనగరం: గజపతినగరం పీఎసీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
- రాజకీయ నాయకుల సిఫార్సులతో రైతుల మధ్య గొడవ..
- రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికే యూరియా అందిస్తున్న అధికారులు..
- కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు..
- అధికారుల తీరుకు నిరసనగా కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేశారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తుంది. గజపతినగరం పీఏసీఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడిన గందరగోళం.. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతన్నలు రోడ్లపై బైఠాయించారు.
Read Also: Kids Mobile Usage : పిల్లలతో మొబైల్ వాడకం తగ్గించే.. 7 సింపుల్ టిప్స్
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
రైతుల ఆందోళన
అయితే, విజయనగం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సమస్య రైతులను ఆందోళనకు గురు చేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరికి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం పీఏసీఎస్ కి యూరియా వస్తుందన సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇక, కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిల్చొని గంటల తరబడి వేచి చూశారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని భావించిన రాజకీయ నాయకులు అక్కడికి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాకత్ అయ్యి కొందరికే యూరియా ఇచ్చినట్టు రైతులు ఆరోపణలు చేయడంతో.. ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం..
ఇక, పీఏసీఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే, ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, రైతులు రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లతో రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో నగరంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: IOB SO Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
యూరియా సరఫరాలో పారదర్శకత
రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని.. ప్రతి రైతుకి పాస్బుక్ ఆధారంగా సముచితంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తక్షణమే ఎక్కువ స్టాక్ అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. పంటలు కీలక దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. ఇది ఆర్థికంగా రైతును దెబ్బతీసే కుట్ర మాత్రమే కాదు, భవిష్యత్ పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఇక, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే, యూరియా సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..