Farmers Protest: విజయనగరంలో ఉద్రిక్తత.. యూరియాకు రాజకీయ నాయకుల సిఫార్సు.. రైతుల మధ్య గొడవ!
- విజయనగరం: గజపతినగరం పీఎసీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
- రాజకీయ నాయకుల సిఫార్సులతో రైతుల మధ్య గొడవ..
- రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికే యూరియా అందిస్తున్న అధికారులు..
- కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు..
- అధికారుల తీరుకు నిరసనగా కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేశారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తుంది. గజపతినగరం పీఏసీఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడిన గందరగోళం.. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతన్నలు రోడ్లపై బైఠాయించారు.
Read Also: Kids Mobile Usage : పిల్లలతో మొబైల్ వాడకం తగ్గించే.. 7 సింపుల్ టిప్స్
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
రైతుల ఆందోళన
అయితే, విజయనగం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సమస్య రైతులను ఆందోళనకు గురు చేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరికి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం పీఏసీఎస్ కి యూరియా వస్తుందన సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇక, కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిల్చొని గంటల తరబడి వేచి చూశారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని భావించిన రాజకీయ నాయకులు అక్కడికి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాకత్ అయ్యి కొందరికే యూరియా ఇచ్చినట్టు రైతులు ఆరోపణలు చేయడంతో.. ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం..
ఇక, పీఏసీఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే, ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, రైతులు రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లతో రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో నగరంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: IOB SO Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
యూరియా సరఫరాలో పారదర్శకత
రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని.. ప్రతి రైతుకి పాస్బుక్ ఆధారంగా సముచితంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తక్షణమే ఎక్కువ స్టాక్ అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. పంటలు కీలక దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. ఇది ఆర్థికంగా రైతును దెబ్బతీసే కుట్ర మాత్రమే కాదు, భవిష్యత్ పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఇక, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే, యూరియా సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!