Vizag Crime News: దారుణం.. పిల్లలకు పురుగుల మందు ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Woman Dies By Drinking Pesticide In Domestic Violence Case: ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇవ్వడంతో పాటు తానూ తాగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఓ చిన్నారి మృతి చెందగా, మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోన్న సంపంగి మోహన కృష్ణతో శైలజ(34)కు 2017లో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత నుంచే అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిస్తే, వాళ్లు బాధపడతారన్న ఉద్దేశంతో.. బాధనంతా తనే దిగమింగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆ దంపతులకు తుషిత(4), అక్షిత(1) అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక ఆమెకు వేధింపులు మరిన్ని ఎక్కువయ్యాయి. ప్రతీ చిన్న విషయంపై కూడా చీవాట్లు పెడుతూ వచ్చారు.
రానురాను అత్తింటివారి వేధింపులు పెచ్చుమీరడంతో కుంగిపోయిన శైలజ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి, తన సోదరికి శైలజ పంపించింది. అందులో భర్త తనని నిత్యం కట్నం కోసం వేధించేవాడని పేర్కొంది. అనంతరం తన పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తానూ తాగింది. ఇది గ్రహించిన అత్తింటివారు.. వెంటనే శైలజతో పాటు పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరమంతా పాకడంతో, చికిత్స పొందుతూ శైలజ చనిపోయింది. అలాగే ఏడాది వయసున్న అక్షిత సైతం మృతి చెందింది. ప్రస్తుతం తుసిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాపని కాపాడేందుకు వైద్యులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించారు. తమ అమ్మాయిని అత్తింటివారు వేధింపులకు గురి చేయడం వల్లే, ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!