Vizag Crime News: దారుణం.. పిల్లలకు పురుగుల మందు ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Woman Dies By Drinking Pesticide In Domestic Violence Case: ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇవ్వడంతో పాటు తానూ తాగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఓ చిన్నారి మృతి చెందగా, మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోన్న సంపంగి మోహన కృష్ణతో శైలజ(34)కు 2017లో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత నుంచే అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిస్తే, వాళ్లు బాధపడతారన్న ఉద్దేశంతో.. బాధనంతా తనే దిగమింగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆ దంపతులకు తుషిత(4), అక్షిత(1) అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక ఆమెకు వేధింపులు మరిన్ని ఎక్కువయ్యాయి. ప్రతీ చిన్న విషయంపై కూడా చీవాట్లు పెడుతూ వచ్చారు.
రానురాను అత్తింటివారి వేధింపులు పెచ్చుమీరడంతో కుంగిపోయిన శైలజ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి, తన సోదరికి శైలజ పంపించింది. అందులో భర్త తనని నిత్యం కట్నం కోసం వేధించేవాడని పేర్కొంది. అనంతరం తన పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తానూ తాగింది. ఇది గ్రహించిన అత్తింటివారు.. వెంటనే శైలజతో పాటు పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరమంతా పాకడంతో, చికిత్స పొందుతూ శైలజ చనిపోయింది. అలాగే ఏడాది వయసున్న అక్షిత సైతం మృతి చెందింది. ప్రస్తుతం తుసిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాపని కాపాడేందుకు వైద్యులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించారు. తమ అమ్మాయిని అత్తింటివారు వేధింపులకు గురి చేయడం వల్లే, ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!