Vizag Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమానికి 500 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడి నేటికి 500రోజులకు చేరుకుంది. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో అడ్డంకులు ఇవేవీ కార్మిక, ఉద్యోగుల ఉక్కు సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. పైగా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమ ప్రణాళికలు మరింత రాటుతేలాయి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా నేడు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది జేఏసీ. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో లావాదేవీల సలహా కమిటీ, న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఉక్కు పరిశ్రమని కాపాడేందుకు కోటి సంతకాల ప్రచారం, పాదయాత్రలు, ర్యాలీలు, రాష్ట్రవ్యాప్త బంద్లు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు చేపట్టి తమ నిరసన తెలిపాయి. వీరి ఆందోళనలకు అధికార వైసీపీ కూడా మద్దతు తెలిపింది.
ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడు కోవడానికి కార్మిక శక్తి పిడికిలిబిగిం చి 500రోజులైంది. ప్రయివేటీకర ణను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన పోరాటం నిరవధికంగా కొనసాగు తోంది. కార్మికులు,ఉద్యోగుల పోరా టాలకు ప్రజలు,రాజకీయ పక్షాల సంపూర్ణ మద్దతు లభించడంతో పొరుబాటులో ఉంటూనే ఫ్యాక్టరీ ని లాభాల పట్టించారు కార్మికులు. 500రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
కూర్మన్నపాలెంలో ని స్టీల్ ప్లాంట్ ఆర్చి దగ్గర నుంచి వందల మంది కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. వీరికి నిర్వాసితులు కలిసి రావడంతో ఈ ర్యాలీ ద్వారా కేంద్రం దృష్టికి తమ డిమాండ్ ను బలంగా తీసుకెళ్లాలనేది ప్రయత్నంగా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి సిటీలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం జంక్షన్ వరకు సుమారు 20కి.మీ బైక్ ర్యాలీ జరుగుతుంది. అక్కడి నుంచి రాజకీయ పక్షాలతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టనున్నారు కార్మికులు. జీవీఎంసీ దగ్గర నిర్వహించే బహిరంగ సభ ద్వారా తమ గళం మరింత గట్టిగా ఢిల్లీకి వినిపించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలనేది ప్రయత్నం.స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రదర్శనతో సిటీలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు పోలీసులు.
Viral News: వీడేం దొంగ.. చిల్లర డబ్బులు దేవుడికే
- Tags
- 500 days movement
- ap
- bike rally
- JAC
- modi
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!