Vishnu Vardhan Reddy: బీజేపీ-జనసేన కలిసి.. 2024 ఎన్నికలను ఎదుర్కొంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vardhan Reddy Gives Clarity On BJP Janasena Alliance: బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. ఈ రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కుంటాయని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ పాలన వైఫల్యాలపై ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.
Pan India War: దేవరతో యుద్ధానికి సిద్ధమవుతున్న పుష్పరాజ్…
Also Read
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
తాము ఇచ్చిన హామీలపై వైసీపీ 90 శాతం వైఫల్యం చెందిందని విష్ణువర్ధన్ ఆరోపించారు. NGT, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. బీజేపీపై జరిగే దుష్ప్రచారం ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. పవన్ బీజేపీతో లేరని దుష్ప్రచారం చేశారని.. రెండు పార్టీల పొత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడేవారని.. అయితే అందులో వాస్తవం లేదని.. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే మీటింగ్కు పిలుపు ద్వారా అందరికీ కనువిప్పు కలిగిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.
YV Subba Reddy: జగన్ బీసీల పక్షపాతి.. ఆ ఘనత ఒక్క ఏపీ ప్రభుత్వానిదే
అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థను స్వలాభం కోసమే ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. వాలంటీర్ల శ్రమను దోపిడీ చేస్తోందని.. వాలంటీర్లను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొ్న్నారు. పవన్ చేసిన ఆరోపణలను సవాల్గా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, పార్టీ నేతలకు ఎలాంటి అధికారం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!