Vishnu Vardhan Reddy: బీజేపీ-జనసేన కలిసి.. 2024 ఎన్నికలను ఎదుర్కొంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vardhan Reddy Gives Clarity On BJP Janasena Alliance: బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. ఈ రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కుంటాయని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ పాలన వైఫల్యాలపై ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.
Pan India War: దేవరతో యుద్ధానికి సిద్ధమవుతున్న పుష్పరాజ్…
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Off The Record : నంద్యాల టీడీపీలో రగులుతున్న ఆధిపత్య పోరు.. పీక్కు చేరిన వర్గ విభేదాలు.!
తాము ఇచ్చిన హామీలపై వైసీపీ 90 శాతం వైఫల్యం చెందిందని విష్ణువర్ధన్ ఆరోపించారు. NGT, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. బీజేపీపై జరిగే దుష్ప్రచారం ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. పవన్ బీజేపీతో లేరని దుష్ప్రచారం చేశారని.. రెండు పార్టీల పొత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడేవారని.. అయితే అందులో వాస్తవం లేదని.. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే మీటింగ్కు పిలుపు ద్వారా అందరికీ కనువిప్పు కలిగిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.
YV Subba Reddy: జగన్ బీసీల పక్షపాతి.. ఆ ఘనత ఒక్క ఏపీ ప్రభుత్వానిదే
అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థను స్వలాభం కోసమే ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. వాలంటీర్ల శ్రమను దోపిడీ చేస్తోందని.. వాలంటీర్లను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొ్న్నారు. పవన్ చేసిన ఆరోపణలను సవాల్గా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, పార్టీ నేతలకు ఎలాంటి అధికారం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?