Southwest Monsoon: నైరుతి రుతుపవనాలకు “షార్ట్ బ్రేక్”.. మండుతోన్న ఎండలు..
- షార్ట్ బ్రేక్ తీసుకున్న నైరుతి రుతుపవనాలు..
- ప్రతికూల వాతావరణం కారణంగా మందగించిన తొలకరి..
- నిప్పుల కుంపటిగా మారిన వాతావరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు “షార్ట్ బ్రేక్” తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందే పలుకరించిందన్న సంతోషం ఆవి
రైంది. ఊరించి.. హుషా రు తెచ్చిన వానలు ముఖం చాటేశాయి. గత నెల 29 తర్వాత మాన్ సూన్ కరెంట్ మందగమనంలో కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వేగంగా విస్తరించిన ఋతువనలు కదలికలు దక్షిణ భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం. ఋతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ మొత్తం వెళ్లిపోవడంతో పొడి గాలులు వీస్తున్నాయి.
Read Also: RCB Stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన బీసీసీఐ..
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలహీనంగా వుంది. అది పుంజుకునే వరకు కదలికలు సాధ్యం కాకపోవచ్చని అంచనా. మరో వారం పాటు నైరుతి రుతుపవనాలు పురోగమనం కష్టమేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఐతే, ఇదేమీ అనూహ్యమైన పరిణామం మాత్రం కాదు. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్దిరోజుల విరామం సాధారణమేనని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 12 తర్వాత తొలకరి విస్తరించడం మొదలయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి మాన్ సూన్ కరెంట్ బలం ఆధారంగా వర్షాలు ఆధారపడతాయి. 15ఏళ్ల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు వున్నాయి. నిర్ధిష్ట కాల ప్రమాణం కంటే ముందుగానే వచ్చి నప్పటికీ విస్తరణ సమయంలో ప్రతికూలత ఏర్పడింది.
Read Also: Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
ఇక., మాన్ సూన్ ముఖం చాటేయడంతో కోస్తా జిల్లాలు ఉడికెత్తిపోతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. జంగ మహేశ్వరపురంలో అత్యధికంగా 41డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణమే అయినప్పటికీ ప్రజలకు తారెత్తిపోతోంది. మరో వారం రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. మరోవైపు, రాష్ట్రం లో అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఐతే., ఈ వానలు స్థానిక వాతావరణ పరిస్థితి కారణంగా వచ్చేవే తప్ప రుతువన వర్షాలు కాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!