Hayagreeva Lands: హయగ్రీవ ఫామ్స్ అండ్ విల్లాస్కు మరో షాక్..!
- హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్..
- సుమారు 500 కోట్ల రూపాయల విలువైన భూములు స్వాధీనం..
- 22ఏ జాబితాలో చేర్చి.. నిషేధిత భూములుగా నోటిఫై..
- రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hayagreeva Lands: విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ కు విశాఖ జిల్లా యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన వ్యాపార భాగస్వాములతో కలిసి వేసిన స్కెచ్ మొదటికే మోసం తెచ్చింది. అక్రమాలపై విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో 16 ఏళ్ల తర్వాత కేటాయింపులు రద్దు చేసినట్టు ప్రకటిం చింది.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..
Also Read
ఇక, ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎండాడలోని సుమారు 500కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుని కంచేవేసింది రెవెన్యూ యంత్రాంగం. సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాలను 22(A) జాబితాలో చేర్చడం ద్వారా నిషేధిత భూములుగా ప్రకటించింది. దీంతో హయగ్రీవకు సంబంధించిన క్రయవిక్రయాలు., రిజిస్ట్రేషన్ లు పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద కోట్లాది రూపాయలు పెట్టిన వాళ్లకు దిక్కుతోచని స్థితి. వృద్దులు కోసం విల్లాలు, అనాథలుకు ఆశ్రమం పేరుతో 2008లో ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూములు తీసుకుంది హయగ్రీవ. ఎకరా 45 లక్షల చొప్పున కొనుగోలు చేయగా.. అడ్డగోలుగా పార్టనర్లను చేర్చుకోవడం ద్వారా భారీ అవకతవకలకు పాలడినట్టు విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం లక్ష్యంగా చేసిన ఈ భూమంతర్ కారణంగా స్థిరాస్తి విలువ 40శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గ్రూపు డెవలప్మెంట్ స్కీమ్ కింద 61 మందితో చేసుకున్న ఒప్పందాల మేరకు విల్లాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో హయగ్రీవ భూ కేటాయింపులు రద్దయ్యాయి. నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. 22(ఏ) కారణంగా ఎటువంటి క్రయవిక్రయాలు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘించడం, స్వార్థంగా వ్యవహరించడం వల్లనే భూమిని వెనక్కి తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
12.51 ఎకరాల భూమిలో 10 శాతం భూమి ఉపయోగించి వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రమం నిర్మిస్తామని, ఉచితంగా నిర్వహిస్తామని ఒప్పందం చేశారు. పదిహేనేళ్లు అయినా దానిని పూర్తి చేయలేదు. కానీ ఈ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల భూమిని రద్దు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?