Ayodhya Ram Mandir Set: విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్.. నిర్వాహకులు అరెస్ట్!
- విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు అరెస్ట్..
- భక్తి పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేసిన నిర్వాహకులు..
- కళ్యాణోత్సవం పేరుతో మరో దోపిడీకి తెర..
- నిర్వహకులపై విశాఖ కలెక్టర్, పోలీసులకు భద్రాద్రి ఆలయ అధికారుల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir Set: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ్ మందిరం వివాదాస్పదంగా మారింది. 45 రోజుల పాటు ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఆలయం నమూనా దగ్గర సీతారాముల కళ్యాణం పేరుతో పోస్టర్లు బ్రోచర్లు కలకలం రేపుతున్నాయి. 2999/- రూపాయలు చెల్లించిన వారికి నమూనా అయోధ్య రామ్ మందిరం వద్ద భద్రాచలం ఆస్థాన వేద పండితుల సమక్షంలో జరిపే కళ్యాణంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని విస్తృత ప్రచారం చేశారు. ఇది కాస్త భద్రాచలం ఆలయ అధికారులకు చేరడంతో తమ ప్రమేయం లేకుండా, అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ విశాఖ జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రామ మందిరం నిర్వాహకులపై 318 (4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, కళ్యాణం టికెట్లు కొన్న భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆలయ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది..
Also Read
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ఇక, భద్రాచలం రాముడి కళ్యాణం పేరుతో భక్తులను మోసం చేస్తున్న గరుడ అయోధ్య రామ మందిర సెట్ నిర్వాహకులపై హిందూ సంఘాలు భగ్గు మంటున్నాయి. విశాఖ బీచ్ రోడ్డులో వేసిన నమూనా ఆలయాన్ని తక్షణం తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రేపు హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళనలకు భక్తులు సిద్ధం అవుతున్నారు. ఉత్తరాంధ్ర సాధువులు రానుండటంతో వ్యవహారం మరింత ముదురుతోంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..